Mayuree Naree: భారత్కు వచ్చే థాయ్ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..
హర్మూజ్ జలసంధి దగ్గర యుద్దం మరింత ముదిరింది. ఇవాళ ఒక్క రోజే మూడు చమురు నౌకలను ఇరాన్ పేల్చేసింది. రెండు అమెరికా నౌకలు , ఓ బ్రిటన్ నౌకను పేల్చేశారు. తాజాగా థాయ్లాండ్కు చెందిన మయూరీ నారీ నౌకను క్ఊడా పేల్చేశారు. దీంతో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. 20మందిని సహాయక సిబ్బంది కాపాడారు. దుబాయ్ నుంచి గుజరాత్ లోని ఖాండ్లా పోర్ట్కు వస్తుండగా ఈ నౌకను పేల్చేశారు.

పశ్చిమాసియాలో రోజురోజుకూ యుద్ధం మరింత ముదురుతుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధి క్లోజ్ చేసిన ఇరాన్ అటు వైపు ఎలాంటి నౌకలు రావద్దని, వస్తే పేల్చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా అటుగా వస్తున్న మూడు నౌకలను పేల్చిసి ఇరాన్ అన్నంత పని చేసింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా ఓడరేవు నుంచి గుజరాత్లో ఖాండ్లా పోర్ట్కు వస్తున్న థాయ్ నౌకపై దాడి చేసి పేల్చేసింది. ఈ నౌకపై తామే దాడి చేసినట్టు ఓ ప్రకటన ద్వారా లేర్కొంది.
అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా ఓడరేవు నుండి బయలుదేరిన ఈ థాయ్ నౌక హార్ముజ్ జలసంధికి వద్దకు చేరుకోగానే ఇరాన్ సైన్యం ఈ నౌకపై దాడి చేసింది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం సముద్రంలో పడిపోయారు. అయితే వీరిలో ఒమానీ నావికాదళం 20 మంది సిబ్బందిని రక్షించగా మరో ముగ్గురు సిబ్బంది ఆచూకీ లభించలేదు. ఆ ముగ్గురు సిబ్బందిని ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టారు.
ఈ ఘటనపై స్పందిస్తూ థాయ్ నేవీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ థాయ్ నేవీ షేర్ చేసిన ఫోటోలు థాయ్-రిజిస్టర్డ్ మయూరీ నౌక నుంచి భారీ నల్లటి పొగ ఎగసిపడుతున్నట్లు, లైఫ్ తెప్పలు నీటిలో తేలుతున్నట్లు కనిపించాయి. అయితే ఈ షిప్ హార్ముజ్ జలసంధిలో ఒమానీ తీరానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు షిప్-ట్రాకింగ్ వెబ్సైట్లు తెలిపాయి. థాయ్ రవాణా సంస్థ ప్రెషియస్ షిప్పింగ్ యాజమాన్యానికి చెందిన ఈ నౌక భారత్లోని కాండ్లా పోర్టుకు వెళ్తోందని.. ఈ నౌక 178 మీటర్ల పొడవు, 30,000 టన్నుల బరువును మోసుకెళ్లగలదని తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
