AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: మంచు మనోజ్ పాన్ ఇండియా మూవీ ఊసే లేదే.. సినిమా ఆగిపోయిందా..?

మొదటి సినిమాలోనే కామెడీని పంచిన మనోజ్ అందరిచేత అదుర్స్ అనిపించుకున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలతోపాటు.. సరికొత్త కథలతో ముందుకొచ్చిన మనోజ్.. క్రిష్ డైరెక్షన్ లో ‘వేదం’ మూవీ చేశాడు.

Manchu Manoj: మంచు మనోజ్ పాన్ ఇండియా మూవీ ఊసే లేదే..  సినిమా ఆగిపోయిందా..?
Manoj Manchu
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2022 | 7:38 AM

Share

మంచు మనోజ్.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఈ యాక్షన్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన మంచు మనోజ్.. ‘దొంగా దొంగది’ మూవీతో హీరోగా కనిపించాడు. మొదటి సినిమాలోనే కామెడీని పంచిన మనోజ్ అందరిచేత అదుర్స్ అనిపించుకున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలతోపాటు.. సరికొత్త కథలతో ముందుకొచ్చిన మనోజ్.. క్రిష్ డైరెక్షన్ లో ‘వేదం’ మూవీ చేశాడు. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం మంచు మనోజ్‌ చేస్తున్న సినిమా ‘అహం బ్రహ్మాస్మి’. ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కొంత కాలంగా ఈ సినిమానుంచి ఎలాంటి ఆప్డేట్ లేదు. దాంతో మనోజ్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు.

అసలు ఈ సినిమా ఉందా.. ఆగిపోయిందా అన్న డైలమాలో పడిపోయారు. పాన్ ఇండియా మూవీగా అహం బ్రహ్మాస్మి తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో విడుదల చేసిన పోస్టర్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఇంతవరకు ఆ మూవీ ఊసే లేదు.

2017లో ఒక్కడు మిగిలాడు అనే సినిమా చేశారు మనోజ్ . ఆ తరువాత మనోజ్ మరో సినిమా చేయలేదు. మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని ‘అహం బ్రహ్మాస్మి’ చేస్తున్నారు దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నెటిజన్లు మనోజ్ ను అహం బ్రహ్మాస్మి గురించి ప్రశ్నించగా స్మైలీ ఎమోజి పెట్టి ఊరుకున్నారు. దాంతో ఈ సినిమా ఆగిపోయి ఉంటుందని అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి ఈ విషయం పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం