ఉప్పెన సినిమా డెబ్యూతో … మంచి స్టార్టప్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన అప్ కమింగ్ ఫిల్మ్ రంగ రంగ వైభవంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తన సినిమా ఆడకపోవడానికి రీజన్ డైరెక్టరే అన్నట్టు ఓపెన్ గా మాట్లాడారు. తన ఓపెన్ హార్టెడ్ మాటలతో కొందరిని ఆకట్టుకుంటూనే మరి కొందరికి షాక్ చేశారు వైష్ణవ్. ఉప్పెన సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో కొండ పొలం మూవీ చేశారు వైష్ణవ్. అయితే ఈ సినిమా చూడగానే తనకు పోతుందనే ఫీలింగ్ కలిగిందని అన్నారు వైష్ణవ్. అయితే అలా పోవడానికి కారణం డైరెక్టర్ క్రిష్ అని ఓపెన్ గా చెప్పారు.
మొదట డైరెక్టర్ క్రిష్ ఈసినిమాను వేరేలా తీద్దామనుకున్నారని.. కాని షూట్కు వెళ్లగానే క్లాసికల్ గా తెరకెక్కిస్తే ఇంకా బాగుందని చెప్పారన్నారు. అందుకోసం ఫారెస్ట్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో నాన్ కమర్షియల్ గా ఈసినిమాను పిక్చరైజ్ చేశారన్నా. కాని షూటింగ్లో ఫుల్ గా ఎంజాయ్ చేశానని చెప్పిన వైష్ణవ్… ఫైనల్ కాపీ చూశాక మాత్రం ఇది పెద్దగా వర్కవుట్ కాదని తనకు అనిపించిందన్నారు. అప్పటి ఆ విషయాన్ని తాజాగా అందరితో పంచుకున్నారు.ప్రస్తుతం వైష్ణవ్ రంగరంగవైభవంగా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.