Gopichand : మరో సినిమా పట్టాలెక్కించే పనిలో గోపీచంద్.. దర్శకుడు ఎవరంటే..
హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నాడు ఈ హీరో. రీసెంట్ గా రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నాడు ఈ హీరో. రీసెంట్ గా రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపలేకాపోయింది. అయినా కూడా గోపీచంద్ దూకుడు ఆపడం లేదు. ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించడానికి రెడీ అవుతున్నారు గోపీచంద్.
కన్నడ కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట గోపీచంద్. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తుందని సమాచారం. ఈ సినిమాకు సంబందించిన పనులు చకచకా జరుగుతున్నాయి.
ఇక హీరోయిన్ మాళవిక శర్మ గురించి ప్రత్యేకంగా ;చెప్పాల్సిన అవసరం లేదు. నేల టిక్కెట్ సినిమా తర్వాత 2021 లో రామ్ రెడ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది ఈ చిన్నది. నేల టిక్కెట్ మాదిరిగానే రెడ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆయా తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది ఈ బ్యూటీ.