Tollywood: ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మిస్ చెన్నై.. 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న 40 ఏళ్ల అందాల ముద్దుగుమ్మ..

|

May 24, 2023 | 8:05 PM

ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరోసారి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్‏తో బిజీగా ఉంది. ముఖ్యంగా తన అందం ఇప్పుడు మరోసారి సినీప్రియులను మైమరపిస్తోంది. గుర్తుపట్టండి ఎవరో..

Tollywood: ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మిస్ చెన్నై.. 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న 40 ఏళ్ల అందాల ముద్దుగుమ్మ..
Actress 3
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులోకి ఇప్పుడు మరో హీరోయిన్ ఫోటో వచ్చి చేరింది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి మిస్ చెన్నై. 1999లో ‘మిస్ చెన్నై’ టైటిల్‌ను గెలుచుకుంది ఈ బ్యూటీ. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. దాదాపు 2 దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరోసారి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్‏తో బిజీగా ఉంది. ముఖ్యంగా తన అందం ఇప్పుడు మరోసారి సినీప్రియులను మైమరపిస్తోంది. గుర్తుపట్టండి ఎవరో.. తనే అందాల ముద్దుగుమ్మ త్రిష.

త్రిష కృష్ణన్ ఇటీవల మణిరత్నం బ్లాక్ బస్టర్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 మరియు పార్ట్ 2 లో కనిపించింది.ఈ సినిమాలో యువరాణి కుందవై పాత్రలో త్రిష మరోసారి మెప్పించింది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో మరింత అందంగా కనిపించి ఆశ్చర్యపరిచింది. నాలుగు పదుల వయసులోనూ దేవకన్యలా మెరిసిన త్రిష ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో ఈ అమ్మడుకు మరోసారి ఆఫర్స్ క్యూకట్టాయి. ప్రస్తుతం ఆమె విజయ్ దళపతి సరసన లియో చిత్రంలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

చెన్నైలో జన్మించిన త్రిష.. వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ప్రభాస్ సరసన కనిపించింది త్రిష. ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళంలోనూ అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది త్రిష. నాలుగు పదుల వయసులోనూ ఒంటరిగా గడిపేస్తుంది త్రిష.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.