ఒకప్పుడు తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్.. ఎవరో తెలుసా.?
హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరమై ఫ్యామిలీలతో గడిపేస్తున్నారు. కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుంటే మరికొంతమంది పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కాగా కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. వారిలో ఈ అమ్మడు ఒకరు

చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే నటించడం మొదలు పెట్టి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అందాల భామలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారే.. అంతే కాదు కొంతమంది చిన్న వయసులోనే హీరోయిన్స్ గా మారిన వారు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్స్ గా రాణించిన వారు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమా ఆఫర్స్ రాక చాలా మంది సినిమాలకు గుడ్ బై చెప్పారు. మరికొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక పైన కనిపిస్తున్న నటి కూడా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. స్టార్ హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు ఐటీ ఉద్యోగిగా మారిపోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ ఆమె..
సినిమాలకు దూరమై ఐటీ ఉద్యోగిగా మారిన ఆ నటి ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ లయ. తెలుగులో ఒకప్పుడు ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు లయ ఫెవరెట్ హీరోయిన్. తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే లయ ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ డ్రామా చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. లయ కూడా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చింది. నాలుగో తరగతి చదువుతున్నప్పుడే ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది.
వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన లయ.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుంది లయ. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఐటీ ఎంప్లాయ్ గా ఉన్న లయ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.