Ranga Maarthanda Trailer: ‘రంగమార్తాండ’ ట్రైలర్ విడుదల.. ఆసక్తిని పెంచుతున్న డైలాగ్స్..

ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఇందులో బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Ranga Maarthanda Trailer: రంగమార్తాండ ట్రైలర్ విడుదల.. ఆసక్తిని పెంచుతున్న డైలాగ్స్..
Rangamaarthanda Trailer

Updated on: Mar 20, 2023 | 7:38 PM

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ప్రిమియర్ షోకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ director-krishnavamshi కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా.. ఇళయారాజా సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఇందులో బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా చూపించినట్లుగా కనిపిస్తోంది. ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ ఈ చిత్రంలో హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. జీవితంలో​ నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. “ఒంటరి జననం.. ఏకాకి మరణం.. నడుమంతా నాటకం.. జగన్నాటకం” అంటూ బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ఆసక్తిని కలిగిస్తోంది.

ఇందులో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చి 22న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. చాలా కాలం తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.