AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడివి శేష్​కు దిల్​రాజు క్రేజీ ఆఫర్!

అడవి శేష్..ఇప్పుడు టాలీవుడ్‌లో ఇతనో స్పెషల్ పర్సన్. కథలు, స్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ చిత్రాలతో  హీారోగా తెలుగు సినిమాని మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నాడు. కాగా తాజగా “ఎవరు”  మూవీ శేష్ మంచి విజయాన్ని అందుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలకు పర్ఫెక్ట్ యాప్ట్ అన్న పేరు ఈ యంగ్ హీరోకు ఉంది. వరుస హిట్​లు కొడుతున్న వేళ అడివి శేష్​కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తర్వాత సినిమాను తన సంస్థలో చేయాలని ఆహ్వానించారు. […]

అడివి శేష్​కు దిల్​రాజు క్రేజీ ఆఫర్!
Ram Naramaneni
|

Updated on: Aug 17, 2019 | 3:24 PM

Share

అడవి శేష్..ఇప్పుడు టాలీవుడ్‌లో ఇతనో స్పెషల్ పర్సన్. కథలు, స్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ చిత్రాలతో  హీారోగా తెలుగు సినిమాని మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నాడు. కాగా తాజగా “ఎవరు”  మూవీ శేష్ మంచి విజయాన్ని అందుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలకు పర్ఫెక్ట్ యాప్ట్ అన్న పేరు ఈ యంగ్ హీరోకు ఉంది. వరుస హిట్​లు కొడుతున్న వేళ అడివి శేష్​కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తర్వాత సినిమాను తన సంస్థలో చేయాలని ఆహ్వానించారు.

శేష్ నటించిన “ఎవరు” డిస్ట్రిబ్యూటర్ వ్యవహరించిన దిల్ రాజు.. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్‌తో హిట్ కొట్టొచ్చని శేష్ నిరూపించాడని ప్రశంసించారు. దిల్ రాజు నిర్మించిన “ఎవడు” చిత్రంలో కొద్దిలో అవకాశాన్ని చేజార్చుకున్న శేష్.. మళ్లీ ఆ అవకాశాన్ని “ఎవరు” తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నటుడు ‘మేజర్​’ సినిమా​లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేశ్​బాబు నిర్మాత.