AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranveer Singh: కాంతార ఇమిటేషన్.. క్షమాపణలు చెప్పడానికి రెడీ అయిన రణవీర్ సింగ్..

ధురందర్ 2 విజయం నేపథ్యంలో ఐకానిక్ కాంతార దైవ సన్నివేశాన్ని అనుకరించినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతూ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానిక సిద్ధమయ్యారు. ఈ మేరకు 2026 ఏప్రిల్ 10న కర్ణాటక హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు . మిమిక్రీతో కన్నడిగ సమాజ మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో, ఫిబ్రవరిలో రణవీర్ సింగ్ ఉపశమనం కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Ranveer Singh: కాంతార ఇమిటేషన్.. క్షమాపణలు చెప్పడానికి రెడీ అయిన రణవీర్ సింగ్..
Ranveer Singh
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2026 | 9:06 PM

Share

ప్రస్తుతం ధురంధర్ 2 సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు హీరో రణవీర్ సింగ్. డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ధ వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ణ్‌వీర్‌ సింగ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయనున్నారు. కాంతార చిత్రంలోన పంజర్లి హావభావాలను వేదికపై ప్రదర్శించడంతో వివాదమైన సంగతి తెలిసిందే. మిమిక్రీతో కన్నడిగ సమాజ మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై రణవీర్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దీంతో ఫిబ్రవరిలో రణవీర్ సింగ్ ఉపశమనం కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో కర్ణాటక హైకోర్టు, ఆ బాలీవుడ్ స్టార్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని అధికారులను ఆదేశించింది .

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

తాజా పరిణామంలో, రణవీర్ సింగ్‌ను మైసూరులోని చాముండి ఆలయానికి తీసుకువచ్చి, స్వయంగా క్షమాపణ చెప్పించడానికి ఆయన న్యాయవాది స్వచ్ఛందంగా సుముఖత వ్యక్తం చేశారు . అయితే, ఫిర్యాదుదారు తరపు న్యాయవాది ప్రశాంత్ మెథల్, నటుడు చేసిన క్షమాపణ నిష్కపటమైనది కాదని వాదించారు. రణవీర్ సింగ్ కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే క్షమాపణ పోస్ట్ చేశారని, నిజాయితిగా క్షమాపణ చెప్పలేదని ఆయన ఎత్తి చూపారు. మెథల్ ఆ చర్యను నిజమైన పశ్చాత్తాపంగా గానీ, హృదయపూర్వక క్షమాపణగా గానీ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

నవంబర్ 30న గోవాలో జరిగిన అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (IFFI) ముగింపు వేడుకలో, రణవీర్ సింగ్ వేదికపై ‘ కంతారా ‘ చిత్రంలోని ‘దైవ’ సన్నివేశాన్ని అనుకరించాడు.ఇందులో ఆ చిత్ర దర్శకుడు , కథానాయకుడు రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.ఆ చారిత్రక చిత్రంలోని ఒక ఐకానిక్ సన్నివేశాన్ని అనుకరిస్తూ అతను చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ఆ నటుడు కన్నడిగ సమాజం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. రణవీర్ సింగ్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ట్రోలింగ్‌పై స్పందించి, తన పొరపాటుకు క్షమాపణలు చెప్పాడు .

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us