ముంబైలో బైక్పై షికారు చేసిన విజయ్.. ఛార్మి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్..
మొదట్లో చిన్న సినిమాల్లో హీరోయిన్గా కనిపించి.. ఆ తర్వాత అగ్ర హీరోలందిరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛార్మి. అటు హీరోయిన్గానే
మొదట్లో చిన్న సినిమాల్లో హీరోయిన్గా కనిపించి.. ఆ తర్వాత అగ్ర హీరోలందిరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛార్మి. అటు హీరోయిన్గానే కాకుండా నిర్మాతగానూ దూసుకుపోతుంది. ఇటీవల మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబోలో తెరకెక్కిన సినిమాకు నిర్మాతగా వ్యవహరించి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ, పూరీ కాంబోలో వస్తున్న లైగర్ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కోసం విజయ్, పూరీ జగన్నాథ్, ఛార్మీలు ముంబైకు చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్లో విజయ్ దేవరకొండను స్కూటీపై ఎక్కించుకొని బైక్ రైడింగ్కు వెళ్ళింది చార్మి. ఆ ఫోటోలను ఛార్మి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. “విజయ్ నన్ను నమ్మి నా బైక్ ఎక్కాడు. షూటింగ్ గ్యాప్లో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాం” అని ట్వీట్ చేసింది. తెలుగుతోపాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది.
As u can c , Vijay surely has a lot of trust on me ???
Fun ride in mumbai in between shot gaps for #LIGER @TheDeverakonda pic.twitter.com/VYVOr8WM1B
— Charmme Kaur (@Charmmeofficial) February 19, 2021
Also Read: