AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే తెలుగు సినీరంగంలోనే సెన్సేషన్ అయ్యింది. హీరోయిన్‏గా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Tollywood : జిమ్‏లో తెగ కష్టపడుతున్న వయ్యారి.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2025 | 4:35 PM

Share

సాధారణంగా సినీరంగంలో తెలుగమ్మాయిలకు అవకాశాలు అంతగా రావు అనేది ఇండస్ట్రీలో టాక్. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అంజలి, ఐశ్వర్య రాజేశ్, వైష్ణవి చైతన్య, కావ్య కళ్యాణ్ రామ్ వంటి ముద్దుగుమ్మలు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటుతుంది ఓ హీరోయిన్. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అటు వరుస సినిమాల్లో నటిస్తూనే ఇటు జిమ్ లో తెగ కష్టపడుతుంది. తాజాగా ఈ బ్యూటీకీ సంబంధించిన క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ? కథానాయికగా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందులో అద్భుతమైన నటనతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మరో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. తనే అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.

యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది వైష్ణవి చైతన్య. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ద్వారా సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రియుడిని మోసం చేసిన ప్రియురాలి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వైష్ణవికి ఒక్కసారిగా మంచి గుర్తంపు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.

బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. బేబీ తర్వాత తను నటించిన పలు చిత్రాలు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

Follow Us