AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నయ్య భేటీలతో తమ్ముళ్ళలో ఉత్కంఠ.. మెగాస్టార్‌ దారెటు ?

చిరంజీవి.. తెలుగునేలతోపాటు యావత్ భారత దేశం మెగాస్టార్‌గా పిలుచుకునే ఈ నటుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎదురు లేని హీరో. సినీ హీరోగా చిరంజీవి వేసిన స్టెప్స్ ఆయన అభిమానులతోపాటు యావత్ తెలుగు ప్రజల మనసులను గెలుచుకున్నాయి. కానీ రాజకీయాల విషయానికి వచ్చే సరికి చిరంజీవి వేసిన స్టెప్స్ గతి తప్పాయి. ప్రజలు బ్రహ్మరథం పడతారనుకుని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎంతో కాలం కొనసాగలేక చతికిలా పడింది. 2009 ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రినవుతాననుకుని పోటీకి దిగిన చిరంజీవి […]

అన్నయ్య భేటీలతో తమ్ముళ్ళలో ఉత్కంఠ.. మెగాస్టార్‌ దారెటు ?
Rajesh Sharma
|

Updated on: Oct 17, 2019 | 1:19 PM

Share

చిరంజీవి.. తెలుగునేలతోపాటు యావత్ భారత దేశం మెగాస్టార్‌గా పిలుచుకునే ఈ నటుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎదురు లేని హీరో. సినీ హీరోగా చిరంజీవి వేసిన స్టెప్స్ ఆయన అభిమానులతోపాటు యావత్ తెలుగు ప్రజల మనసులను గెలుచుకున్నాయి. కానీ రాజకీయాల విషయానికి వచ్చే సరికి చిరంజీవి వేసిన స్టెప్స్ గతి తప్పాయి. ప్రజలు బ్రహ్మరథం పడతారనుకుని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎంతో కాలం కొనసాగలేక చతికిలా పడింది. 2009 ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రినవుతాననుకుని పోటీకి దిగిన చిరంజీవి సంయుక్తాంధ్రప్రదేశ్‌లోని 294 సీట్లలో దక్కింది కేవలం 18.

ప్రజలిచ్చిన తీర్పుతో ఖంగుతిన్న మెగాస్టార్ ఆ తర్వాత స్లోగా తన పంథా మార్చుకోవడం ప్రారంభించారు. రాజకీయంగా సైలెంటై పోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత ఏపీసీసీకి చరిష్మా వున్న నేత కరువవడంతో దాన్ని తాను పూరించే అవకాశం వుందని భావించి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దాంతో సోనియాగాంధీ ఆయన్ను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. ఏకంగా కేబినెట్ హోదాలో కేంద్ర మంత్రయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కానీ.. ఆయనకు ఆ స్థాయిలో పట్టం కట్టినా పెద్దగా ప్రభావవంతమైన నేతగా ఆయన్ను తెలుగు ప్రజలు చూడకపోవడంతో.. 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర విభజనే తక్షణ కర్తవ్యం అన్న నిర్ణయానికి వచ్చింది సోనియమ్మ.

రాష్ట్ర విభజన అంశం మెగాస్టార్ చిరంజీవిని అటు ఏపీ, ఇటు తెలంగాణకు కాకుండా చేసింది. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావడం.. ఈ గ్యాప్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని నేతగా ఎదిగిపోవడం చకచకా జరిగిపోయాయి. దాంతో రాజకీయ  రంగం నుంచి పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయేందుకు చిరంజీవి సిద్దపడ్డారు. తనకు బాగా అచ్చొచ్చిన సినిమాల వైపు దృష్టి పెట్టారు. మచ్ వెయిటెడ్ 150వ సినిమాతో చిరంజీవి టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. ఆ తర్వాత రెండేళ్ల శ్రమతో నిర్మించిన సైరా నరసింహారెడ్డితో మరోసారి ప్రేక్షకులను అలరించారు.

ఇందంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపు ఏం జరుగుతోంది ?  సైరా సక్సెస్‌ని ఆస్వాదిస్తున్న చిరంజీవి ఉన్నట్లుండి పొలిటికల్ భేటీల దిశకు మళ్లారు. అనూహ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అమరావతి వెళ్ళారు. వీరిద్దరి కలయిక విపరీతమైన చర్చకు తెరలేపింది. ఒకవైపు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ద్వారా జగన్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తే ఆయన సోదరుడు ఏకంగా జగన్‌ను కల్వడమేంటని మెగా ఫ్యాన్స్ మధనపడిపోయారు.

అదే సమయంలో మరిన్ని ఊహాగానాలు తెరమీదికొచ్చాయి. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి చొరవ చూపాలని, విశాఖలో స్టూడియో నిర్మించాలని అందుకు ప్రభుత్వం తరపున చేయవలసిన సాయం చేస్తామని సీఎం.. చిరంజీవికి హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. దాంతో ఆగకుండా వైసీపీలో చేరాలని చిరంజీవిని జగన్ కోరారని, అందుకు ప్రతిఫలంగా రాజ్యసభకు నామినేట్ చేస్తామని సీఎం చెప్పినట్లు.. అందుకు చిరంజీవి అంగీకరించినట్లు కూడా ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారం ఒకవైపు కొనసాగుతుండగానే చిరంజీవి అనూహ్యంగా ఢిల్లీ వెళ్లారు. ఒకప్పటి బిజెపి నేత, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో చిరంజీవి భేటీ అయ్యారు. సైరా మూవీ ప్రత్యేక షోని అరేంజ్ చేసి.. వెంకయ్య నాయుడి మెప్పు పొందారు మెగాస్టార్. దాంతో చిరంజీవి బిజెపి వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం మొదలైంది. వారు కూడా రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్రంలో మంత్రి పదవిని చిరంజీవికి ఆఫర్ చేశారని సమాచారం.

ఈ నేపథ్యంలో మెగా స్టార్ సన్నిహితులు మాత్రం ఈ రెండు భేటీలు కేవలం సైరా సక్సెస్ నేపథ్యంలో మాత్రమే జరిగాయని చెబుతున్నారు. సినిమా రిలేటెడ్ భేటీలే అయితే.. సైరా మూవీ నిర్మాతనో, దర్శకుడూ, లేక ఇతర కీలకమైన నటులో ఈ భేటీల్లో ఎందుకు పాల్గొనలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ట్రిపుల్ ఆర్ మూవీతో హీరో, నిర్మాత రామ్ చరణ్ బిజీగా వున్నారనే అనుకున్నా… దర్శకుడు సురేందర్ రెడ్డి, మిగిలిన పెద్ద నటులు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, నయనతార, సుదీప్ తదితరుల్లో ఒక్కరినైనా తమ వెంట జగన్ దగ్గరికో… వెంకయ్య నాయుడు దగ్గరికో మెగాస్టార్ తీసుకుని వెళ్ళి వుండొచ్చు. కానీ అలా జరగలేదు. తానొక్కరే వెళ్లడం ద్వారా చిరంజీవి పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త చర్చకు తెరలేపారు. సో.. ఇప్పుడు చిరంజీవి అడుగులు వైసీపీ వైపా లేక బిజెపి వైపా ? మెగాఫ్యాన్స్‌ని ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్నలివి.

ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..