AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balayya: బాలయ్య విక్రమ సింహ భూపతి ఎందుకు ఆగిపోయింది..?

నటసింహం బాలకృష్ణ, ఎస్. గోపాల్ రెడ్డి కాంబినేషన్ లో భారీ జానపద చిత్రంగా ప్రారంభమైన విక్రమసింహ భూపతి అనేక అంచనాల మధ్య 2001లో శ్రీకారం చుట్టుకుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందాల్సి ఉన్న ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. దీని వెనుక అనేక కారణాలు చెబుతారు. ఈ ఘటన నిర్మాత గోపాల్ రెడ్డిని తీవ్ర మనోవేదనకు గురి అయినట్లు చెబుతుంటారు.

Balayya: బాలయ్య విక్రమ సింహ భూపతి ఎందుకు ఆగిపోయింది..?
Nandamuri Balakrishna
Ram Naramaneni
|

Updated on: Jul 14, 2026 | 6:41 PM

Share

మహానటుడు ఎన్టీఆర్ తర్వాత జానపద, చారిత్రిక పాత్రల పోషణలో తనదైన ముద్ర వేసుకున్న నందమూరి బాలకృష్ణ, ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయలుగా, భైరవ ద్వీపంలో జానపద వీరుడిగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆధునిక కాలంలోనూ జానపద చిత్రాలకు ఆదరణ ఉంటుందని నిరూపించారు. ఈ నేపథ్యంలో, బాలకృష్ణతో ఓ అద్భుతమైన జానపద చిత్రాన్ని తీయాలని భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి సంకల్పించారు. బాలకృష్ణకు, భార్గవ్ ఆర్ట్స్ సంస్థకు ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉంది. నేను బాలయ్య అభిమానినే అని గోపాల్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం, బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాల్ రెడ్డి కాంబినేషన్ లో మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య వంటి విజయవంతమైన చిత్రాలు రావడంతో అభిమానులలో విక్రమసింహ భూపతిపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 2001 జనవరి 9న హైదరాబాద్ లోని తెలుగు లలిత కళా వేదికలో అభిమానుల సమక్షంలో భారీగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ విక్రమసింహ భూపతి, ఒక యుద్ధ వీరునిగా ద్విపాత్రాభినయం చేస్తారని ప్రకటించారు. రోజా, అంజలా జవేరి, పూజా బాత్రా కథానాయికలుగా, నాజర్, శరత్ బాబు, విజయ్ చందర్, ఎల్.బి శ్రీరామ్, కే.ఆర్. విజయ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య తారాగణంగా ఎంపికయ్యారు. విక్రమసింహ భూపతి అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

చిత్ర యూనిట్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేసి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. సినిమాలో రెండు భారీ యుద్ధ ఘట్టాలు ఉంటాయని, వాటిలో ఒకటి రాజస్థాన్ లో, మరొకటి అరకు లోయలో చిత్రీకరించాలని ప్రణాళికలు రచించారు. ముఖ్యంగా, అరకు లోయలో చిత్రీకరించాల్సిన యుద్ధ సన్నివేశాన్ని ఇంటర్వెల్ సన్నివేశంగా రూపొందించి, భారతీయ తెరపై అంతవరకు ఎవరూ చూడని రీతిలో అత్యంత భారీగా తీయడానికి గోపాల్ రెడ్డి ప్రణాళికలు వేశారు. అలాగే, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, ఒక పాట, కొంత యాక్షన్ పార్ట్ చిత్రీకరించడం కోసం వైజాగ్ లోని కొండల మధ్య ఒక రాజనగర్ సెట్ ను కూడా ఏర్పాటు చేశారు. రామోజీ ఫిలిం సిటీలోని అతిపెద్ద ఫ్లోర్ ను అద్దెకు తీసుకుని మరో భారీ సెట్ ను నిర్మించారు. అయితే, ఈ భారీ ప్రణాళికలు, అంచనాల మధ్య అనూహ్యంగా విక్రమసింహ భూపతి చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్ లో ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు. వైజాగ్ లో వేసిన రాజనగర్ సెట్ లో కూడా షూటింగ్ జరగలేదు. ఈ చిత్ర నిలుపుదలకు రకరకాల కారణాలు చెబుతారు. కొందరు హీరో, నిర్మాత మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొనగా, మరికొందరు హీరో, దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని చెబుతారు. దీని వెనుక నిజమైన కారణాలు ఇప్పటికీ ప్రకటితం అవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ.. ఈ సినిమా ఆగిపోవడం నిర్మాత గోపాల్ రెడ్డికి ఇబ్బందిని కలిగించింది. సినిమాను పూర్తి చేయలేకపోవడం అనే మనోవేదన ఆయనను చాలా కాలం వెంటాడింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఆయనకు డేట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్టులు కూడా కార్యరూపం దాల్చలేదు. విక్రమసింహ భూపతి తెలుగు సినీ చరిత్రలో ఒక అసంపూర్ణ కలగా మిగిలిపోయింది.

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం