Pushpa 2: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా అల్లు అర్జున్ పుష్ప 2.. ఎన్ని స్క్రీన్స్‌లలో తెలుసా?

|

Oct 26, 2024 | 2:31 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ఫ 2 రిలీజ్ కోసం అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్గు 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో డిసెంబర్ 6 కు వాయిదా పడింది. అయితే ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన మేకర్స్ ఒకరోజు ముందుగానే పుష్ఫ 2ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Pushpa 2: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా అల్లు అర్జున్ పుష్ప 2.. ఎన్ని స్క్రీన్స్‌లలో తెలుసా?
Pushpa 2
Follow us on

టాలీవుడ్ ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబరు 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల జరిగిన నేషనల్‌ ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో సన్సేషనల్‌ న్యూస్‌ను వెల్లడించారు మేకర్స్‌. పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు మేకర్స్‌. ఇండియాలో 6500 స్క్రీన్స్ లలో, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్ లలో గ్రాండ్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు నిర్మాతలు. అయితే ఇది బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌. ఇక పుష్ప-2 బాక్సాఫీస్‌ రూల్‌లో కలెక్షన్ల పరంగా బాక్సీఫీస్‌ వద్ద ఎన్నో సంచలనాలు కూడా సృష్టిస్తుందని అంటున్నాయి ట్రేడ్‌ విశ్లేషకులు.

 

ఇవి కూడా చదవండి

కాగా మొదటి పార్ట్ కంటే మించి ఉండేలా సుమారు రూ. 500 కోట్లతో పుష్ఫ 2 సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారుఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.