Adipurush: ‘జై శ్రీరామ్’ .. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత ఓం రౌత్ మొదటి ట్వీట్.. నెటిజన్ల రియాక్షన్స్ వైరల్
దాదాపు 7000కు పైగా థియేటర్లలో విడుదలైన ఈ మైథలాజికల్ మూవీకి మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే వీఎఫ్క్స్ బాగోలేదని, డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని వక్రీకరించాడని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ అతనిపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో 'ఓం.. కమ్ టు మై రూమ్' అన్న ప్రభాస్ డైలాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాముడి అవతారంలో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నాడు. అతను నటించిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం (జూన్ 16)న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైంది. దాదాపు 7000కు పైగా థియేటర్లలో విడుదలైన ఈ మైథలాజికల్ మూవీకి మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే వీఎఫ్క్స్ బాగోలేదని, డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని వక్రీకరించాడని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ అతనిపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో ‘ఓం.. కమ్ టు మై రూమ్’ అన్న ప్రభాస్ డైలాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఆదిపురుష్ రిలీజ్ తర్వాత మొదటిసారి స్పందించారు డైరెక్టర్ ఓం రౌత్. ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫొటోస్ అన్నింటినీ కోలేజ్ రూపంలో షేర్ చేస్తూ ‘ దేశంలోని అన్ని థియేటర్లు ఆధ్యాత్మిక భావనతో నిండిపోయాయి’ అని రాసుకొచ్చారు. దీనికి ‘జై శ్రీరామ్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఎప్పటిలాగే నెటిజన్లు ఓం రౌత్ పై ట్రోలింగ్కు దిగారు. ‘రౌత్.. ఎక్కడువున్నావ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
విమర్శలు, ట్రోల్స్ వస్తున్నా మొదటి రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపింది ఆదిపురుష్. ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డుల వేట మొదలెట్టింది . ఇక బాహుబలి 2 తర్వాత ప్రభాస్కు మంచి సాలిడ్ హిట్ దొరికిందని డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమాలో జానకిగా కృతిసనన్ నటించారు. రెట్రో ఫైల్ సమర్పణలో టీ సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం.




Jai Shri Ram ?? pic.twitter.com/oyXY57U7Lz
— Om Raut (@omraut) June 17, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
