Rashmika Mandanna: రోజూ పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా.. వాళ్లను వేరుగా చూడలేను: రష్మిక
ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన లైఫ్స్టైల్కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయింది రష్మిక మందన్నా. సౌత్తో పాటు బాలీవుడ్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటోంది. అదే సమయంలో తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన లైఫ్స్టైల్కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ నాకు వచ్చిన గుర్తింపును చూసి అమ్మానాన్నలు అంతలా గర్వపడరు. ఎందుకంటే వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అసలు నేనేం చేస్తున్నాననేది కూడా వాళ్లకు అర్థం కాదు. అయితే ఎప్పుడైనా ఏదైనా అవార్డు వచ్చిందంటే మాత్రం తెగ సంబరపడిపోతారు. వాళ్లు నన్ను చూసి గర్వపడాలంటే నేనింకా చాలా సాధించాల్సి ఉందని అర్థమైంది. అమ్మానాన్న నన్ను ఏ లోటూ లేకుండా పెంచారు. అందుకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే! ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను వాళ్లను బాగా చూసుకుంటాను. నా లైఫ్ స్టైల్ విషయానికొస్తే.. చిన్నచిన్న విషయాలు కూడా నాకెంతో ముఖ్యమైనవి’
‘నేను లేవగానే నా కుక్కపిల్లలతో ఆడుకుంటాను. అది మనసుకు ఎంతో హాయినిస్తుంది. మన మాటలు ఎంతో శక్తివంతమైనవి. ఆ మాటలతో మనిషిని నిలబెట్టవచ్చు. అదే మనిషి మనసును ముక్కలు చేయవచ్చు. నేను నా డైరీలో ప్రతి చిన్న విషయాలు కూడా రాసుకుంటాను. నేను ఇంటికి రాగానే అందరి పాదాలకు నమస్కరిస్తాను. నా కుటుంబ సభ్యులవి మాత్రమే కాదు మా ఇంట్లో ఉండే పనివాళ్ల కాళ్లకు సైతం నేను నమస్కరిస్తాను. వాళ్లను వేరుగా చూడడం నాకు ఏ మాత్రం ఇష్టముండదు. నాకు అందరినీ గౌరవించడం మాత్రమే తెలుసు’ అని తన గురించి చెప్పుకొచ్చింది రష్మిక. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అలాగే రణ్బీర్ కపూర్ సరసన యానిమల్, నితిన్తో కలిసి మరో మూవీలో హీరోయిన్గా కనిపించనుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..