AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని..

ఒకప్పుడు అందాల తార రంభ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. నటనతోనే కాదు అందంతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అందాల తార రంభ. ఈ బ్యూటీని దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటీ ఆతర్వాత ఈ చిన్నది వరుసగా అవకాశాలు అందుకుంటూ రాణించింది.

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని..
Rambha
Rajeev Rayala
|

Updated on: May 12, 2026 | 9:39 AM

Share

అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ లో మొదటి వరసలో ఉండే పేరు రంభ. ఒకప్పుడు ఆమె ఇండస్ట్రీని ఊపేసింది. అందం అభినయంతో ఉర్రుతలూగించిన రంభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రంభ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. సినీ రంగంలో తనకు ఎదురైన అనుభవాలు, తన అభిమాన నటులు, పెళ్లి విశేషాల గురించి తెలిపారు రంభ. ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి గారితో కలిసి తొలిసారి నటించినప్పుడు తనకు చాలా ఇన్ఫాట్యుయేషన్ ఉండేదని రంభ గుర్తుచేసుకున్నారు. ఆయన అంటే చాలా ఇష్టం.. ఆయన ముందు నిలబడాలన్నా, మాట్లాడాలన్నా చాలా సిగ్గుపడేదాన్నని, అసలు మాట్లాడేదాన్నే కాదని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : దట్ ఈజ్ పవర్ స్టార్..! ఆ రోజు పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..

హిట్లర్ చిత్రంలోని అబ్బబ్బీ పాట చిత్రీకరణ సమయంలో చిక్ మంగళూర్ లో ఉన్నప్పుడు, అందరూ తన గురించి చిరంజీవికి చెప్పిన తర్వాతనే తాను ధైర్యం చేసి తన అభిమానాన్ని చిరంజీవిగారికి వ్యక్తం చేశానని తెలిపారు రంభ. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అంటే ఇప్పటికీ తనకు చాలా ఇష్టమని, ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించాలని కోరుకుంటున్నానని రంభ వెల్లడించారు. ఒక కోకా-కోలా యాడ్ మిస్ అవ్వడం వల్ల షారుఖ్ ఖాన్‌తో పనిచేసే అవకాశం కోల్పోయానని ఆమె చెప్పారు.

ఇది కూడా చదవండి : Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను

సినీ పరిశ్రమలో తనకు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని, అయితే ఆ రహస్యాలను బయటపెట్టలేనని, వారంతా ఇప్పుడు  స్థిరపడ్డారని రంభ తెలిపారు. తన మాతృభాష తెలుగు అని, తన తొలి చిత్రం సర్గం తన కెరీర్‌లో ఒక మలుపు అని రంభ చెప్పారు. తన వివాహం గురించి ప్రస్తావిస్తూ, తన తల్లి చిన్నతనంలో తన పెళ్లి తిరుపతిలో జరగాలని మొక్కుకున్నారని, ఆ మొక్కును తీర్చడానికే తన వివాహం తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా జరిగిందని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తన పెళ్లికి వచ్చి మా ఇంటి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు రంభ..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us