AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Sharma: రాజకీయాల్లోకి రామ్ చరణ్ హీరోయిన్.. ఎన్నికల ప్రచారంలో బిజీగా నేహా శర్మ.. ఎవరికోసమంటే..

2024 లోక్ సభ ఎన్నికల్లో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా ఈసారి సినీ తారలు కూడా పాల్గొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నటీనటులు పోటీ పడుతుండగా.. మరికొందరు తమ నాయకులకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె బీహార్‎లో రోడ్ షో నిర్వహించారు. గురువారం బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో తన తండ్రి అజిత్ శర్మకు మద్దతుగా భారీ రోడ్‌షో నిర్వహించారు.

Neha Sharma: రాజకీయాల్లోకి రామ్ చరణ్ హీరోయిన్.. ఎన్నికల ప్రచారంలో బిజీగా నేహా శర్మ.. ఎవరికోసమంటే..
Neha Sharma
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2024 | 11:06 AM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో లోక్ సభ, మరికొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పుడు దేశమంతటా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా ఈసారి సినీ తారలు కూడా పాల్గొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నటీనటులు పోటీ పడుతుండగా.. మరికొందరు తమ నాయకులకు మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె బీహార్‎లో రోడ్ షో నిర్వహించారు. గురువారం బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో తన తండ్రి అజిత్ శర్మకు మద్దతుగా భారీ రోడ్‌షో నిర్వహించారు. భాగల్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేహాశర్మ తండ్రి అజిత్ శర్మ పోటీ చేస్తున్నారు.

నేహా శర్మ, ఆమె తండ్రి థార్‌పై ప్రయాణించి సోనావర్సా నుండి నౌగాచియా వరకు ప్రచారం చేశారు. బంకా, కిషన్ గంజ్, కతిహార్, పూర్నియాతో సహా బీహార్ లోని వివిధ జిల్లాల్లో ఆమె రోడ్ షో నిర్వహించారు. తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించింది నేహా శర్మ. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపింది. “ఎవరైనా హృదయంలో స్థానం ఇస్తే అక్కడ శాశ్వతంగా జీవిస్తారని చెబుతారు. మీరు నాపట్ల చూపిన ప్రేమ, ఆదరణ నా గుండెను నింపేసింది. పిర్ పైంటి, కహల్ గావ్ కు సాదర స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది నేహాశర్మ.

కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), వామపక్ష పార్టీలతో కూడిన కూటమి మహాఘట్‌బంధన్‌కు చెందిన వందలాది మంది కార్యకర్తలు కూడా రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం అజిత్ శర్మ భాగల్పూర్ సదర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2010లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ రాజకీయాల్లోకి వచ్చి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. అలాగే తన కూతురికి టికెట్ ఇప్పించేందుకు అజిత్ శర్మ ప్రయత్నించగా.. కాంగ్రెస్ మాత్రం అతడికే మళ్లీ టికెట్ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.