AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..
Ntr
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2026 | 1:12 PM

Share

నటి మమతా మోహన్‌దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు సంపాందించుకుంది. క్యాన్సర్ కారణంగా చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం గురించి వివరించారు. ఎన్టీఆర్‌ను కేవలం ఒక నటుడిగా కాకుండా, ఒక అద్భుతమైన వ్యక్తిగా తాను భావిస్తానని ఆమె వెల్లడించారు. తారక్ శక్తిని తాను ఎంతగానో అభిమానిస్తానని, అతను తన అభిమాన వ్యక్తి అని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే తన బాధలను పంచుకుంటానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్‏లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..

మమతా, ఎన్టీఆర్ ఇద్దరికీ సంగీతం పట్ల విపరీతమైన ప్రేమ ఉందని, ఇదే వారిద్దరి మధ్య బలమైన బంధానికి కారణమని ఆమె తెలిపారు. వారిద్దరూ కలిసినప్పుడు “యో! వాట్స్ అప్” అని పలకరించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని చెప్పారు. సంవత్సరాలు గడిచినా, ఈ అనుబంధంలో ఎటువంటి మార్పు రాలేదని, అదే శక్తి, అదే స్నేహం కొనసాగుతున్నాయని మమతా వివరించారు. ఈ అనుబంధానికి నిదర్శనంగా, తాను యూఎస్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఒకరోజు అకస్మాత్తుగా తనకు ఫోన్ చేశారని, అది తనను ఆశ్చర్యపరిచిందని ఆమె పంచుకున్నారు. “రాండమ్‌గా కాల్ చేశాను” అని తారక్ చెప్పడం వారి మధ్య ఉన్న సహజసిద్ధమైన, నిరాడంబరమైన బంధాన్ని చాటుతుందని మమతా అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..

తొలి రోజుల్లో తాను సినీ పరిశ్రమలో పెద్దగా ఎవరితోనూ మాట్లాడలేదని, అప్పట్లో తాను చాలా చిన్న వయసులో ఉన్నానని, సినిమా గురించి తనకు అంతగా తెలియదని మమతా తెలిపారు. అయితే, ఎన్టీఆర్, జగపతి బాబు వంటి కొద్దిమంది నటులతో మాత్రం తాను స్నేహాన్ని పెంచుకున్నానని చెప్పారు. ఈ ఇద్దరినీ తాను కేవలం నటులుగా చూడనని, వ్యక్తులుగా వారిని ఎంతో గౌరవిస్తానని అన్నారు. వారిద్దరితో సమానమైన వైబ్, ఎనర్జీ, అర్థవంతమైన మాటలు సాధ్యమవుతాయని, వారితో ఏదైనా మాట్లాడవచ్చని మమతా పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Follow Us