
బుల్లి తెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షో ఇప్పటికే 9 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక అప్పుడే పదవ సీజన్ పై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ మధ్య బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఈ రియాలిటీ గురించి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హైస్ లో ఉన్న సీక్రెట్స్ ను బయట పెడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది కంటెస్టెంట్స్ ఈ బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ నటి కిర్రాక్ సీత కూడా ఇప్పుడు ఈ జాబితాలో నిలిచింది. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పనిలో పనిగా బిగ్ బాస్ రియాలిటీ షో గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘చాలామంది బిగ్ బాస్ షోకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశాను అని అనిపిస్తుంది. బిగ్ బాస్ వల్లే ఇప్పుడు ఏమీ ఆఫర్స్ రావడం లేదు. గతంలో ఉన్న కమిట్మెంట్స్ ఏవి ఇప్పుడు నా దగ్గరికి రావడం లేదు.. బిగ్ బాస్ కు వెళ్ళకముందు వచ్చిన 10వేలు అయినా చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఈ మధ్య ఖర్చులు కూడా పెరిగాయి. నెలకు నేను ఈఎంఐ, అలాగే ఇంటికి సంబంధించిన లోను ఇవన్నీ కలిపి 2 లక్షలకు పైగా కట్టాలి. ఇప్పుడు ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నాను. నాజీవితంలో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సీత. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఇప్పుడు సహాయక నటి పాత్రలతో ఆడియెన్స్ ను మెప్పిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.