ఉదయ్ ‘మనసంతా నువ్వే’కి 19ఏళ్లు.. ఎమ్మెస్ రాజు ఎమోషనల్
దివంగత ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’ విడుదలై ఈ అక్టోబర్ 19కి 19ఏళ్లు పూర్తయింది.
దివంగత ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’ విడుదలై ఈ అక్టోబర్ 19కి.. 19ఏళ్లు పూర్తయింది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మంచి కథ, కథనంతో పాటు చక్కటి నటీనటుల కలయికతో సినిమా స్థాయి రెట్టింపయ్యింది. ఈ సినిమా విజయంతో నిర్మాతగా ఎమ్మెస్ రాజు మరో మెట్టు ఎక్కారు. ‘మనసంతా నువ్వే’ 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్మెస్ రాజు ఆ చిత్ర విశేషాలను తెలుపుతూ ట్విటర్ ద్వారా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎదుర్కున్న ఇబ్బందులు.. విడుదల తర్వాత వచ్చిన రెస్పాన్స్ తదితర విషయాలను లేఖలో ప్రస్తావించారు. ఆయన రాసిన లేఖ మీకోసం…
#ManasanthaNuvve నా సినిమాల్లో చాలా ప్రత్యేకమైనది.సూపర్ టీమ్ వర్క్ తో బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగాం. ఈ విజయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ .ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం మాత్రం చాలా బాధగా ఉంది. @vn_aditya @sirivennela1955 @GkParuchuri @rppatnaik @VeeruPotla1 #Reemasen pic.twitter.com/dPm96DCq9x
— MS Raju (@MSRajuOfficial) October 19, 2020
Also Read : టీవీ9 ‘ఆపరేషన్ చార్లి’ ఎఫెక్ట్, సీటీలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు