AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హారర్ కామెడీ సీక్వెల్‌లో తమన్నా..?

టాలీవుడ్ హారర్ కామెడీ సిరీస్‌ ‘రాజు గారి గది’లో మూడో భాగం రానుంది. ఇందుకోసం ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న ఓంకార్ ప్రస్తుతం స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నాడు. మరోవైపు కథాకథానాయికలను ఎంపిక చేస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఇందులో మెయిన్ లీడ్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కథ తమన్నాకు చాలా నచ్చిందని, డేట్స్ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని టాక్. అయితే హారర్ కామెడీలో నటించడం తమన్నాకు కొత్తేం కాదు. గతంలో ప్రభుదేవా […]

హారర్ కామెడీ సీక్వెల్‌లో తమన్నా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 08, 2019 | 1:09 PM

Share

టాలీవుడ్ హారర్ కామెడీ సిరీస్‌ ‘రాజు గారి గది’లో మూడో భాగం రానుంది. ఇందుకోసం ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న ఓంకార్ ప్రస్తుతం స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నాడు. మరోవైపు కథాకథానాయికలను ఎంపిక చేస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఇందులో మెయిన్ లీడ్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కథ తమన్నాకు చాలా నచ్చిందని, డేట్స్ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని టాక్.

అయితే హారర్ కామెడీలో నటించడం తమన్నాకు కొత్తేం కాదు. గతంలో ప్రభుదేవా సరసన దేవి(తెలుగులో అభినేత్రి)లో నటించిన తమన్నా.. ప్రస్తుతం ఆ మూవీ సీక్వెల్‌లో కూడ నటిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా హారర్ కామెడీగా తెరకెక్కిన రాజు గారి గది మొదటి భాగం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు మంచి కలెక్షన్లను సాధించింది. దీంతో నాగార్జున, సమంత ప్రధానపాత్రలలో రెండో భాగాన్ని తెరకెక్కించాడు ఓంకార్. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.