AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sirisha: భర్తతో విడాకులు తీసుకున్న సీరియల్ నటి.. విడిపోవడానికి కారణం అదేనంటూ పోస్ట్..

ఇటీవలే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి విడాకుల గురించి నెట్టింట పెద్ద చర్చే జరిగింది. తమ జీవితం గురించి అనవసరమైన విషయాలను ప్రచారం చేస్తున్నారంటూ.. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడకూడదని జీవీ ప్రకాష్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలుగు బుల్లితెర నటి కూడా తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది.

Actress Sirisha: భర్తతో విడాకులు తీసుకున్న సీరియల్ నటి.. విడిపోవడానికి కారణం అదేనంటూ పోస్ట్..
Sirisha
Rajitha Chanti
|

Updated on: May 16, 2024 | 3:37 PM

Share

సినీ పరిశ్రమలో విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయ్యింది. కొన్నాళ్లుగా చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ విడాకులు తీసుకున్నామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. కానీ విడిపోవడానికి గల కారణాలు మాత్రం బయటపెట్టడం లేదు. దీంతో తారల వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని.. వారి విడాకులకు గల కారణాలపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. దీంతో వీరిద్దరి విడాకుల గురించి నెట్టింట పెద్ద చర్చే జరిగింది. తమ జీవితం గురించి అనవసరమైన విషయాలను ప్రచారం చేస్తున్నారంటూ.. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడకూడదని జీవీ ప్రకాష్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలుగు బుల్లితెర నటి కూడా తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది.

సీరియల్ నటి శిరీష తన భర్త నవీన్‏తో విడిపోయినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ నోట్ షేర్ చేసింది. “నా అభిమానులు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాం. నేను, నవీన్ భార్యాభర్తలుగా విడిపోయాం. మా నియంత్రణలో లేని కొని్ని పరిస్థితుల కారణాంగా మేము ఇద్దరం విడిపోయాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. వీలైతే సపోర్ట్ చేయండి కానీ మమ్మల్ని విమర్శించకండి. నాకు నవీన్ పై ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రెటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరం అనిపించింది. అందుకే షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి” అంటూ పోస్ట్ చేసింది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శిరీష తెలుగులో అనేక సీరియల్లలో నటించింది. మొగలిరేకులు సీరియల్ ద్వారా మొదలైన ప్రయాణం.. ఆ తర్వాత స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం, పున్నాగ వంటి సీరియల్లో నటించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫ్యామిలీ విషయాలను పంచుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా