AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ కొట్టేసిన కియారా!

టాలీవుడ్‌లో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే ఛాన్స్ కొట్టేసిందింది కియారా అడ్వాణీ. కొన్ని నెలల్లో పట్టాలెక్కబోయే మూడు భారీ ప్రాజెక్టుల్లో ముద్దుగుమ్మ కియారా అవకాశం దక్కించుకుందట. ఇప్పటికే ఆమెతో దర్శక, నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని..

టాలీవుడ్‌లో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ కొట్టేసిన కియారా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 9:17 AM

Share

టాలీవుడ్‌లో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది కియారా అడ్వాణీ. కొన్ని నెలల్లో పట్టాలెక్కబోయే మూడు భారీ ప్రాజెక్టుల్లో ముద్దుగుమ్మ కియారా అవకాశం దక్కించుకుందట. ఇప్పటికే ఆమెతో దర్శక, నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

‘కబీర్ సింగ్‌’తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కియారా అడ్వాణీ.. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా.. బాగానే పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’, చెర్రీతో ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా కియారా టాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటించబోతుందంటూ ప్రచారం సాగుతోంది.

అవి ఏంటంటే.. డార్లింగ్ ప్రభాస్-నాగ్ అశ్విన్, ఎన్టీఆర్-త్రివిక్రమ్, మహేష్-పరుశురామ్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో హీరోయిన్ రోల్ కోసం కియారాతో చర్చలు జరుపుతున్నాయి సదరు చిత్ర బృందాలు. అయితే మరి వీటిల్లో వేటికి కియారా ఓకే  చెబుతుందో చూడాలి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది