AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తేదీని ప్రకటించిన సింగర్ సునీత.. శ్రీవారిని దర్శించుకున్న గాయని.. మ్యారెజ్ ఎప్పుడంటే ?..

సింగర్ సునీత, ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో గత కొన్ని రోజుల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో

పెళ్లి తేదీని ప్రకటించిన సింగర్ సునీత.. శ్రీవారిని దర్శించుకున్న గాయని.. మ్యారెజ్ ఎప్పుడంటే ?..
Rajitha Chanti
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Dec 31, 2020 | 12:39 PM

Share

సింగర్ సునీత, ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో గత కొన్ని రోజుల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో సునీత పెళ్ళి ఆ రోజు, ఈ రోజు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. తాజాగా సింగర్ సునీత తన పెళ్ళి వార్తలపై స్పందించింది.

తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సునీత. అనంతరం తన పెళ్ళి వార్తలపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘వచ్చే నెల 9వ తేదీన నా వివాహాం జరగనుంది’ అని తెలిపింది. కరోనా కారణంగా తొమ్మిది నెలలు శ్రీవారి దర్శనానికి దూరమయ్యాను. అలాగే కొత్త జీవితం బాగుండాలని ఆ శ్రీవారిని ప్రార్ధించాను. ఇప్పుడు వైకుంఠ ద్వారం గుండా ఆ స్వామిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని సునీత తెలిపింది. కొవిడ్ ప్రభావంతో కొద్ది మంది సన్నిహితుల మధ్యే సునీత వివాహం జరగనుంది. సింగర్ సునీత 19 ఏళ్ల వయసులోనే పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత తన భర్తతో విడాకులు తీసుకొని పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది.