మరో సినిమాకు ఓకే చెప్పిన సమంత..?
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తరువాతి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ‘మహా సముద్రం’ పేరుతో అజయ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్గా సమంత ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ను విన్న సమంత వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు ఆమెను బాగా మెప్పించినట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ […]
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తరువాతి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ‘మహా సముద్రం’ పేరుతో అజయ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్గా సమంత ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ను విన్న సమంత వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు ఆమెను బాగా మెప్పించినట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా కోసం మొదట బెల్లంకొండ శ్రీనివాస్ను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా తరువాత రవితేజ, నాగ చైతన్య పేర్లు వినిపించాయి. చివరకు శర్వా ఈ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఇప్పుడు హీరోయిన్గా సమంత ఓకే చెప్పినట్లు వార్తలు వస్తుండటంతో.. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘మహా సముద్రం’ అవ్వనుంది. శర్వానంద్, సమంత ఇద్దరు ’96’ రీమేక్ ‘జాను’లో నటించారు. ఈ సినిమాను ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.