విలన్‌కు ‘సాహో’ టీం గుడ్‌బై

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సాహో’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ దేశ్‌ముఖ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ తదితర భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రంలో తమిళ నటుడు అరుణ్ విజయ్ ఓ విలన్‌గా కనిపించనున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న అరుణ్ విజయ్ పార్ట్ ఇటీవల పూర్తైంది. Its […]

విలన్‌కు ‘సాహో’ టీం గుడ్‌బై
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2019 | 10:59 AM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సాహో’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ దేశ్‌ముఖ్, ఎవెలిన్ శర్మ, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ తదితర భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రంలో తమిళ నటుడు అరుణ్ విజయ్ ఓ విలన్‌గా కనిపించనున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న అరుణ్ విజయ్ పార్ట్ ఇటీవల పూర్తైంది.

దీంతో ఆయనకు సాహో టీం గుడ్‌బై చెప్పింది. ఆయనతో కేక్ కట్ చేయించి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని అరుణ్ విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘‘ఈ టీంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్, సుజీత్, యూవీ, సాహో యూనిట్ మొత్తానికి థ్యాంక్స్. ఈ ప్రయాణం నాకు గుర్తుండిపోతుంది. ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఎదురుచూస్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టాడు. కాగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో రానున్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.