AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas 20: ప్రభాస్ మూవీకి సంగీత దర్శకుడు ఫిక్స్..!

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

Prabhas 20: ప్రభాస్ మూవీకి సంగీత దర్శకుడు ఫిక్స్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2020 | 5:31 PM

Share

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది కావొస్తున్నా.. సంగీత దర్శకుడు గురించి ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌లను ఇచ్చిన నిర్మాతలు సంగీత దర్శకుడి పేరును మాత్రం ప్రస్తావించలేదు.

కానీ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీకి సంగీత దర్శకుడు ఎప్పుడో ఫిక్స్ అయ్యారట. సైరా మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేది, ప్రభాస్ మూవీకి సంగీతం అందిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరపడం.. ఈ మూవీకి అమిత్ పాటలు ఇచ్చేయడం జరిగాయని ఫిలింనగర్ వర్గాల టాక్. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకు ఎందుకు చేయలేదన్నది గమనించాల్సిన విషయం. అయితే సైరాకు అమిత్ మంచి సంగీతం అందించారు. అలాగే నాని, సుధీర్ బాబులు నటించిన వి చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించగా.. ఈ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో తెలుగులో అమిత్‌కు మంచి క్రేజ్ రాగా.. ప్రభాస్ టీమ్ ఆయననే సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే.

Read This Story Also: ‘కరోనా’ అంటూ ఆఫీసుకు డుమ్మా.. 3 నెలలు జైలు శిక్ష..!