AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాసరి ప్రభు వచ్చేశారు.. వీడిన మిస్సింగ్ హిస్టరీ..!

దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదన్న విషయం విదితమే. జూన్ 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాసరి ప్రభు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మిస్సింగ్‌ తరువాత ప్రభు చిత్తూరులో కనిపించారని, ఇంటి వివాదాల కారణంగానే ఆయన అక్కడకు వెళ్లారని సమాచారం. తన అత్త, భార్యతో కలిసి వెళ్లిన ఆయన జాడ కొన్ని రోజులుగా తెలియకపోవడంతో హాట్ టాపిక్‌గా […]

దాసరి ప్రభు వచ్చేశారు.. వీడిన మిస్సింగ్ హిస్టరీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: Nikhil|

Updated on: Jun 19, 2019 | 8:26 PM

Share

దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదన్న విషయం విదితమే. జూన్ 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాసరి ప్రభు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మిస్సింగ్‌ తరువాత ప్రభు చిత్తూరులో కనిపించారని, ఇంటి వివాదాల కారణంగానే ఆయన అక్కడకు వెళ్లారని సమాచారం. తన అత్త, భార్యతో కలిసి వెళ్లిన ఆయన జాడ కొన్ని రోజులుగా తెలియకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల.. హఠాత్తుగా మియాపూర్‌లో ఆయన రెండు రోజులపాటు కనిపించినట్టు వార్తలు వచ్చాయి. అంతలోనే ఆయన కనబడటంలేదంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన ఆచూకి లభ్యమైందని పోలీసులు తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో ఆయన నివాసానికి చేరుకున్నారని పేర్కొన్నారు.

కాగా.. గతంలో.. 2008లో కూడా ఆయన ఇలానే అదృశ్యమయ్యారు. మళ్లీ మీడియా ముందుకు వచ్చి తన భార్య సుశీలనే కిడ్నాప్ చేయించిందని ఆరోపించారు. సుశీల, ప్రభులు 1995లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని కారణాల నేపథ్యంలో ఇద్దరూ గొడవపడి విడాకులు తీసుకున్నారు. బహుశా ఆస్తి వివాదాలే ఈ వరుస సంఘటనలకు కారణమని భావిస్తున్నారు.