AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మెగా’ అల్లుళ్లకు పవర్‌స్టార్ అభినందలు

మెగా హీరోలు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాము నటించిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మార్కులు పడటంతో తబ్బుబ్బిపోతున్నారు. దీంతో ప్రస్తుతం వారిద్దరు సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరికి ఇప్పుడు అభినందనలు తెలిపారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. వీరితో పాటు డైరక్టర్, ప్రొడ్యూసర్, సినిమా బృందాలకు ఆయన తన అభినందనలు తెలిపారు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఈ నెల 12న […]

'మెగా' అల్లుళ్లకు పవర్‌స్టార్ అభినందలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 14, 2020 | 7:48 AM

Share

మెగా హీరోలు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాము నటించిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మార్కులు పడటంతో తబ్బుబ్బిపోతున్నారు. దీంతో ప్రస్తుతం వారిద్దరు సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరికి ఇప్పుడు అభినందనలు తెలిపారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. వీరితో పాటు డైరక్టర్, ప్రొడ్యూసర్, సినిమా బృందాలకు ఆయన తన అభినందనలు తెలిపారు.

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లలోనూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది అల వైకుంఠపురములో. ఈ క్రమంలో బన్నీకి బొకేను పంపిన పవన్.. ‘‘అల్లు అర్జున్ గారు అల వైకుంఠపురములో సినిమా మంచి విజయాన్ని అందుకుంటున్నందుకు కంగ్రాట్స్. ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లకు ఆల్ ది బెస్ట్’’ అని కామెంట్ పెట్టారు. ఇక ఆ బొకేను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బన్నీ.. ‘‘పవన్ కల్యాణ్ గారి నుంచి అభినందనలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యు పవన్ కల్యాణ్ గారు’’ అని కామెంట్ పెట్టారు.

మరోవైపు గత నెలలో వచ్చి సక్సెస్ సాధించిన ప్రతిరోజు పండగే విజయాన్ని పురస్కరించుకొని సాయి ధరమ్ తేజ్‌కు బొకేను పంపారు పవన్. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్.. లవ్ యు పవన్ మామ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.