AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hidimbha OTT: ఓటీటీలో ‘హిడింబ’కు సూపర్‌ రెస్పాన్స్‌.. క్లైమాక్స్ ట్విస్ట్‌ అదిరిపోయింది.. ఎక్కడ చూడొచ్చంటే?

కొన్నిసార్లు థియేటర్లలో హిట్‌ కానీ సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని సార్లు బిగ్‌ స్ర్రీన్‌పై ఆకట్టుకోకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్‌పై రికార్డులు సృష్టిస్తున్నాయి. రవితేజ రావణాసుర, ఆది టాప్‌ గేర్‌, సీఎస్‌ఐ సనాతన్‌ వంటి సినిమాలో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం రికార్డ్‌ వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా చేరింది. అదే యంగ్ హీరో అశ్విన్‌ నటించిన హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నందితా శ్వేత కథానాయిక.

Hidimbha OTT: ఓటీటీలో 'హిడింబ'కు సూపర్‌ రెస్పాన్స్‌.. క్లైమాక్స్ ట్విస్ట్‌ అదిరిపోయింది.. ఎక్కడ చూడొచ్చంటే?
Hidimbha Movie
Basha Shek
|

Updated on: Aug 25, 2023 | 11:44 AM

Share

కొన్నిసార్లు థియేటర్లలో హిట్‌ కానీ సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని సార్లు బిగ్‌ స్ర్రీన్‌పై ఆకట్టుకోకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్‌పై రికార్డులు సృష్టిస్తున్నాయి. రవితేజ రావణాసుర, ఆది టాప్‌ గేర్‌, సీఎస్‌ఐ సనాతన్‌ వంటి సినిమాలో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం రికార్డ్‌ వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా చేరింది. అదే యంగ్ హీరో అశ్విన్‌ నటించిన హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నందితా శ్వేత కథానాయిక. జూలై 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిడింబ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. సరికొత్త జానర్‌, ఆకట్టుకునే కంటెంట్, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేకు తోడు నటీనటులు అద్భుతంగా నటించినా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం రికార్డులు కొల్లగొడుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా హిడింబ డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఓటీటీలోకి వచ్చింది. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి హిడింబ సినిమా ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది.

150 మిలియన్‌ నిమిషాలకు పైగా..

బిగ్‌ స్క్రీన్‌పై ఆకట్టుకోని హిడింబ ఓటీటీలో మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆగస్టు 23 వరకు ఈ సినిమాకు ఏకంగా 150 మిలియన్ నిమిషాలకు పైగా స్ట్రీమింగ్‌ వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది ఆహా ఓటీటీ. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ సినిమాకు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తుందని అందులో పేర్కొన్నారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ హిడింబ సినిమాను నిర్మించారు. ఏక్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత అనిల్‌ సుంకర ఈ సినిమాను సమర్పించారు. అశ్విన్‌, నందితో పాటు శ్రీనివాసరెడ్డి, మకరంద్‌ దేశ్ పాండే, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, రఘు కుంచె, సంజయ్ స్వరూప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు బాడిస వికాస్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

కథేంటంటే..

హిడింబ కథ విషయానికి వస్తే.. నగరంలోని అమ్మాయిలు వరుసగా కిడ్నాప్‌కు గురవుతుంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన అశ్విన్, నందితలకు ఊహించని వాస్తవాలు తెలుస్తాయి. మనుషుల రక్తం తాగే హిడింబ జాతికి చెందిన ఒక మనిషి సాధారణ మనుషుల్లో తిరుగుతున్నాడని తెలుసుకుంటారు. మరి ఆ నరరూప రాక్షసుడు ఎవరు? పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనేది తెలుసుకోవాలంటే హిడింబ సినిమాను చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఓ రేంజ్‌లో ఉందంటున్నారు ఆడియెన్స్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!