నమత్రతో నా టెన్షన్ దూరం: మహేశ్ బాబు
తన భార్య నమత్ర చాలా స్ట్రిక్ట్ అంటూ చెప్పుకొచ్చారు సూపర్స్టార్ మహేశ్ బాబు. తమ పిల్లల విషయంలోనే కాకుండా తన విషయంలో కూడా ఆమె చాలా కఠినంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మహర్షితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు.. తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. ‘‘పిల్లల విషయంలో, నా విషయంలో నమ్రత చాలా […]
తన భార్య నమత్ర చాలా స్ట్రిక్ట్ అంటూ చెప్పుకొచ్చారు సూపర్స్టార్ మహేశ్ బాబు. తమ పిల్లల విషయంలోనే కాకుండా తన విషయంలో కూడా ఆమె చాలా కఠినంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది మహర్షితో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు.. తన 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నాడు.
‘‘పిల్లల విషయంలో, నా విషయంలో నమ్రత చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అది కచ్చితంగా మా మంచికే. ఎందుకంటే నేను పిల్లల్ని చాలా గారాబం చేస్తాను. ఆ గారాబం వారిపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆమె జాగ్రత్తపడుతుంటుంది. నా కుటుంబం వల్లనే నా ఒత్తిడి మాయమవుతుంది. సినిమాల విషయంలోనే కాదు. నాకు కంగారు కలిగించే ఏ విషయంలోనైనా నా భార్య, పిల్లలు నన్ను ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు’’ అంటూ మహేశ్ బాబు వెల్లడించాడు.
కాగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మహేశ్ సరసన రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.