AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్శకనిర్మాతలు ప్రకటించికముందే.. లీక్‌ చేసిన మెగా బ్రదర్..!

లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు.

దర్శకనిర్మాతలు ప్రకటించికముందే.. లీక్‌ చేసిన మెగా బ్రదర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 17, 2020 | 4:33 PM

Share

లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ఇటీవల ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ సినిమాల గురించి మాట్లాడారు నాగబాబు. ప్రస్తుతం పవన్‌ వకీల్ సాబ్‌, క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుండగా.. ఆ రెండు సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో చెప్పారు.

పింక్‌ రీమేక్‌గా వకీల్ సాబ్‌ను తెరకెక్కిస్తున్నప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలా మార్పులు చేశారని పవన్‌ తనతో చెప్పినట్లు నాగబాబు అన్నారు. ఈ కథ పవన్‌కు బాగా సరిపోతుందని.. ఫ్యాన్స్‌కు ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుందని ఆయన వెల్లడించారు. ఇక క్రిష్ మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ గురించి వస్తోన్న పుకార్లలో చాలా నిజాలు ఉన్నాయని తెలిపారు. విరూపాక్ష టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీ కోహినూర్ వజ్రం చుట్టూ తిరగనుందని వివరించారు. అంతేకాదు ఔరంగజేబుల కాలం నాటి కథగా తెరకెక్కబోతున్న ఈ మూవీలో పవన్‌ దొంగగా కనిపించబోతున్నట్లు నాగబాబు స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ టైటిల్ గురించి అధికారిక ప్రకటన రాకముందే.. నాగబాబు టైటిల్‌ను లీక్‌ చేయడం గమనర్హం.

Read This Story Also: ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకోవడానికి అసలు కారణం వేరే ఉందట..!