‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకోవడానికి అసలు కారణం వేరే ఉందట..!
చిరంజీవి నటిస్తోన్న ఆచార్య నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్స్ల వలన ఈ మూవీ నుంచి తాను తప్పుకున్నట్లు త్రిష సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
చిరంజీవి నటిస్తోన్న ఆచార్య నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్స్ల వలన ఈ మూవీ నుంచి తాను తప్పుకున్నట్లు త్రిష సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ నుంచి త్రిష తప్పుకోవడంపై చిరంజీవి కూడా స్పందించారు. ఈ మూవీ నుంచి ఉన్నట్లుండి త్రిష తప్పుకోవడంతో తాను కూడా షాక్కు గురయ్యామని.. కానీ ఆ తరువాత తనకు అసలు విషయం తెలిసిందని చిరు చెప్పారు. మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియన్ సెల్వన్ మూవీ కోసం త్రిష డేట్లు ఇచ్చిందని.. అందుకే తమ మూవీలో నుంచి తప్పుకుందని మెగాస్టార్ వివరించారు. దీంతో ఈ కాంట్రావర్సీ ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిష తప్పుకోవడానికి మరో కారణం ఉన్నట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది.
అదేంటంటే.. ఆచార్య మూవీ యూనిట్తో త్రిషకు మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది. సినిమా యూనిట్లో కీలకంగా ఉన్న ఓ యూనిట్ మెంబర్తో తనకు ఇబ్బందులు వచ్చాయని.. కానీ ఆ మెంబర్ ఆచార్య టీమ్లో కీలకమైన వ్యక్తి కావడంతో ఏమీ చేయలేకపోయిన త్రిష.. మెగాస్టార్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఆ యూనిట్ మెంబర్తో తనకు ఉన్న ఇబ్బందుల గురించి చిరంజీవికి గానీ.. చిత్ర యూనిట్లోని మిగిలిన సభ్యులకు గానీ త్రిష వెల్లడించనట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో షూటింగ్లో జాయిన్ అవ్వాల్సి ఉందన్న సమయంలో త్రిష ఆచార్య నుంచి తప్పుకోవడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంటూనే.. ఆ పాత్రలో కాజల్ను ఫైనల్ చేసింది మూవీ యూనిట్.
Read This Story Also: AA20: బన్నీ ‘పుష్ప’.. విజయ్ సేతుపతి స్థానంలో ఆ నటుడు..!