AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Sister : మరోసారి మాజీ మిస్ ఇండియాను టాలీవుడ్ కు తీసుకొస్తున్న కింగ్ నాగార్జున

నాగార్జున తెలుగు తెరకు మిస్ ఇండియా లను మిస్ యూనివర్స్ లను తీసుకుని రావడం ఇదేమీ కొత్త కాదు.. గతంలో రక్షకుడు సినిమాలో నాగార్జున కు జోడీగా మిస్ ఇండియా విశ్వసుందరి సుస్మితా సేన్ నటించగా....

Nagarjuna Sister : మరోసారి మాజీ మిస్ ఇండియాను టాలీవుడ్ కు తీసుకొస్తున్న కింగ్ నాగార్జున
Surya Kala
|

Updated on: Feb 19, 2021 | 4:08 PM

Share

Nagarjuna Sister : ఏఎన్నార్ నట వారసుడుగా వెండి తెరపై అడుగు పెట్టిన నాగార్జున ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడు నటిస్తున్నాడు.  బాలీవుడ్ లో శివ మూవీతో అడుగు పెట్టి సూపర్ హిట్ అందుకున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ నవ మన్మధుడు.. అమితాబ్ సినిమా ఖుదాగవా లో నటించిన నాగ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’‌లో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

ఇక నాగార్జున మొదటి నుంచి విభిన్న నేపధ్య కథలతో.. సత్తా ఉన్న కొత్త దర్శకుల సినిమాల్లో నటిస్తూ వారిని ప్రోత్సహిస్తాడు.. తాజాగా లే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా మొదలు పెట్టాడు.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి మొదలు పెట్టుకోనున్నది ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. నాగార్జున చెల్లెలుగా మాజీ మిస్ ఇండియాను తీసుకోవడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట..

నాగార్జున చెల్లెలుగా చంఢీఘర్ భామ..మాజీ మిస్ ఇండియా .. మిస్ యూనివర్స్ పోటీల్లో మెరిసిన‌ గుల్‌పనాగ్‌‌ను తీసుకుందట చిత్రబృందం. ఇక మరో కీలక పాత్రలో గోవా సుందరు ఇలియానా ను తీసుకోనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది.

అయితే నాగార్జున తెలుగు తెరకు మిస్ ఇండియా లను మిస్ యూనివర్స్ లను తీసుకుని రావడం ఇదేమీ కొత్త కాదు.. గతంలో రక్షకుడు సినిమాలో నాగార్జున కు జోడీగా మిస్ ఇండియా విశ్వసుందరి సుస్మితా సేన్ నటించగా.. రావోయి చందమామ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించాడు..

ఇక నాగార్జున, ప్రవీణ్ సత్తార్ కాంబోలో సినిమా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుందట.. అందుకనే సినిమాకోసం వివిధ భాషల్లోని నటీనటులను తీసుకుని హైప్ తీసుకుని వస్తున్నారనే టాక్.. ఇక నారాయణ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు NIA ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో కనిపించిన వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్నది.

Also Read:

ఆ ఆఫర్ నాకే ముందు వచ్చింది. అయితే బన్నీ కాకుండా నేను చేస్తే అట్టర్ ఫ్లాప్‌ అయ్యేదంటున్న అక్కినేనివారబ్బాయి

 ‘దృశ్యం’ను మించిన ట్విస్టులు.. ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తున్న మోహన్ లాల్ ‘దృశ్యం 2’..

Follow Us