AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విలన్‌ను ఖేల్ ఖతం చేసిన మహేష్.. దీపావళికి ఫ్యాన్స్‌కు ట్రీట్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా విలన్‌ ఇంటికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది. […]

విలన్‌ను ఖేల్ ఖతం చేసిన మహేష్.. దీపావళికి ఫ్యాన్స్‌కు ట్రీట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 21, 2019 | 11:26 AM

Share

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా విలన్‌ ఇంటికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది.

ఈ విషయాన్ని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘‘విలన్ ఇంటికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. 2020 సంక్రాంతి సూపర్ ఫన్‌గా ఉండబోతోంది. ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాము. సరిలేరు నీకెవ్వరు దీవాళి ట్రీట్‌కు సిద్ధంగా ఉండండి’’ అని ట్వీట్ చేశాడు. కాగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.