AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆన్‌లైన్’‌లో కీర్తి మరో చిత్రం..!

కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. త్వరలోనే తిరిగి చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి.

'ఆన్‌లైన్'‌లో కీర్తి మరో చిత్రం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2020 | 12:26 PM

Share

కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. త్వరలోనే తిరిగి చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చేసింది. జూన్ నుంచి షూటింగ్‌లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా దేశవ్యాప్తంగా త్వరలోనే షూటింగ్‌లకు అనుమతులు ఇస్తామని అన్నారు.

అయితే షూటింగ్‌లకు పర్మిషన్‌ లభించినప్పటికీ.. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఆగష్టులో తెరిచే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తున్నప్పటికీ.. ప్రభుత్వాలు మాత్రం మరికొన్ని రోజులు థియేటర్లు ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చాలా సినిమాలు ఆన్‌లైన్ బాట పడ్డాయి. అన్ని భాషల్లోనూ చాలా చిత్రాలు ఇప్పుడు డైరెక్ట్‌గా రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటికి సంబంధించిన డేట్లు కూడా వచ్చేశాయి. అందులో కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రం కూడా ఉంది. తెలుగు, తమిళ్‌లో ఈ చిత్రం జూన్‌ 19న విడుదల కాబోతోంది.

కాగా తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ నటించిన మరో చిత్రం కూడా ఆన్‌లైన్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో కీర్తి నటించిన ‘మిస్ ఇండియా’ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్లు ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నదియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్‌ కోనేరు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందించారు.

Read This Story Also: ‘అత్యాచారం’పై హైకోర్టు సంచలన తీర్పు..!