AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వాసుపత్రికి జ్యోతిక 25లక్షల విరాళం.. సర్వత్రా ప్రశంసలు

కరోనా వేళ పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు.

ప్రభుత్వాసుపత్రికి జ్యోతిక 25లక్షల విరాళం.. సర్వత్రా ప్రశంసలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 08, 2020 | 4:52 PM

Share

Jyothika donation to hospital: కరోనా వేళ పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి జ్యోతిక ఓ ఆసుపత్రికి 25లక్షలను విరాళంగా ఉన్నారు. తంజావూర్‌లోని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కోసం ఆమె 25లక్షలను ఇచ్చారు.

అయితే ఆ మధ్య జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో ఆసుపత్రులపై జ్యోతిక కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ నిర్వహణకి పెట్టే ఖర్చుతో పాటు హుండీలో వేసే మొత్తాన్ని ఆసుపత్రుల్లో వసతులు కల్పించడానికి కేటాయిస్తే బావుంటుందని ఆమె అన్నారు. తన సినిమా షూటింగ్ కోసం ఓ ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ పాములు కనిపించాయని, వసతులు కూడా సరిగా లేవని విమర్శించారు. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. పలువురు జ్యోతికపై విమర్శలు చేశారు. అర్చకులు సైతం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ విమర్శలకు తాజాగా తన చర్యతో చెక్‌ పెట్టారు జ్యోతిక. మరోవైపు జ్యోతిక చేసిన సాయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read This Story Also: కోళీకోడ్‌ విమానాశ్రయానికి ఏడాది ముందే నోటీసులు