దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పవన్‌పై హీరోయిన్ సంచలన ట్వీట్.. వెంటనే..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు దిశకు న్యాయం జరిగింది అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించింది. నిందితులను ఎన్‌కౌంటర్ చేసినందుకు గానూ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే.. పవన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది పూనమ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన పూనమ్.. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ లోపే ఈ […]

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పవన్‌పై హీరోయిన్ సంచలన ట్వీట్.. వెంటనే..!
Follow us

| Edited By:

Updated on: Dec 06, 2019 | 5:34 PM

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు దిశకు న్యాయం జరిగింది అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించింది. నిందితులను ఎన్‌కౌంటర్ చేసినందుకు గానూ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే.. పవన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది పూనమ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన పూనమ్.. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ లోపే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

కాగా ఆ ట్వీట్‌లో ‘‘ఈ ఉదయం మంచి వార్తను విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో పవన్ కల్యాణ్‌ పేరును ప్రత్యక్షంగా వాడనప్పటికీ.. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటలను కామెంట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్‌ పవన్‌కేనని అందరినీ అర్థమైంది. కానీ బాధితురాలు పేరును వాడినందుకో లేక మరో కారణమో తెలీదు కాసేపటికే ఈ ట్వీట్‌ను పూనమ్ డిలీట్ చేసింది. అయితే ఇటీవల రేపిస్ట్‌ల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్.. నిందితులకు రెండు బెత్తం దెబ్బలు తగిలించాలి అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

అంతేకాదు ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ‘‘దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు థ్యాంక్స్. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నా. అలాగే ఇలాంటి కేసుల్లో దోషులకు క్షమాభిక్ష అవసరం లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించడం చాలా ఆనందంగా ఉంది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే పవన్‌ కల్యాణ్‌కు పూనమ్ చురకలంటించడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కామెంట్లు చేసింది. దీనిపై పవన్ అభిమానులు కూడా ఆమెను పలుమార్లు ట్రోల్ చేశారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు