BSNL: మరో కొత్త ప్లాన్తో వచ్చిన బీఎస్ఎన్ల్.. ఓటీటీల కోసం ప్రత్యేక రీచార్జ్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..
BSNL New Offer: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం కాలక్రమేణా తన ప్రాభావ్యాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి పెరుగుతోన్న ఒత్తిడి, మారుతోన్న సాంకేతికతను...
BSNL New Offer: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం కాలక్రమేణా తన ప్రాభావ్యాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి పెరుగుతోన్న ఒత్తిడి, మారుతోన్న సాంకేతికతను అందుకోకపోవడంతో బీఎస్ఎన్ఎల్ రేసులో వెనుకపడిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ మళ్లీ పూర్వవైభవాన్ని పొందే పనిలో పడింది. ఇందులో భాగంగానే పలు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్ రీచార్జ్ ఆఫర్ను ప్రకటించిన బీఎస్ఎన్లు తాజాగా ఓటీటీల కోసం ఓ ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. ‘సినిమా ప్లస్’ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త సర్వీస్ను కేవలం రూ.129 రీచార్జ్తోనే పొందవచ్చు. నిజానికి ఈ ఆఫర్ అసలు ధర రూ.199 కాగా ప్రారంభ ఆఫర్ కింద మొదటి మూడు నెలలపాటు రూ.129కే అందిస్తోంది. దీనిద్వారా.. సోనీ లివ్ స్పెషల్, వూట్, యప్ టీవీ ప్రిమీయం, జీ5 ప్రీమియం వంటి ఓటీటీలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్లతో పాటు ఆండ్రాయిడ్ టీవీ, అమేజాన్ ఫైర్ టీవీ ఫ్లాట్ ఫామ్లలో అందుబాటులో ఉండనుంది.
Also Read: Actress Pooja Hegde: న్యూడ్ ఫోటో పెట్టాలని కోరిన అభిమాని.. ఊహించని విధంగా ఫోటో పెట్టిన పూజా హెగ్డే..