AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిటర్.. ఇప్పుడు 2500 కోట్ల ఆస్తులున్న రిచెస్ట్ హీరో.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతున్న వారిలో చాలా మంది కెరీర్ ప్రారంభంలో వివిధ రకాల పనులు, ఉద్యోగాలు చేసిన వారే. పాకెట్ మనీ కోసం చిన్న చిన్న జాబ్స్ కూడా చేసిన వారు ఉన్నారు. ఈ స్టార్ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Tollywood:ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిటర్.. ఇప్పుడు 2500 కోట్ల ఆస్తులున్న రిచెస్ట్ హీరో.. ఎవరో తెలుసా?
Bollywood Hero
Basha Shek
|

Updated on: Jun 21, 2025 | 6:18 PM

Share

భారతీయ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుల్లో ఈ హీరో కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీలో అతనిది సుమారు 33 ఏళ్ల ప్రస్థానం. ఒక్కో సినిమాకు వందల కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటాడు. అందుకే ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకడిగా చెలామణి అవుతున్నాడు. అలాగే ఆయన అత్యధిక పన్ను చెల్లించే హీరోల్లో కూడా ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చాలామంది లాగే ఈ హీరో కూడా కెరీర్ ప్రారంభంలో పలు రకాల పనులు, ఉద్యోగాలు చేశాడు. సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు ప్యాకెట్ మనీ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. అలా చిన్నప్పుడే బ్యాంకాక్ లోని ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా కూడా పనిచేశాడు. అప్పుడు అతని జీతం ఎంతో తెలుసా? జస్ట్ రూ.1500. అక్కడే కరాటే, తైక్వాండాలో శిక్షణ తీసుకున్న తర్వాత మళ్లీ ముంబైకి వచ్చాడు. మోడలింగ్ చేశాడు. ఆ తర్వాత నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ లతో పోటీ పడుతూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి స్టార్ హీరోగా చెలామణి అయ్యాడు. అయితే ఈ మధ్యన ఈ స్టార్ హీరోకు ఏదీ కలిసి రావడం లేదు. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అయితేనేం తన స్టార్ డమ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ఇప్పటికీ ఏడాదికి నాలుగైదు, సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.

చిన్నప్పటి నుంచి ధారాసింగ్ ను చూస్తూ పెరిగిన అక్షయ్ కుమార్ ఆయన లాగే కరాటే, తైక్వాండోలో శిక్షణ తీసుకున్నాడు. అలా బ్యాంకాక్ వెళ్లినప్పుడు పాకెట్ మనీ కోసం స్థానికంగా ఉండే రెస్టారెంట్ లో వెయిటర్ గా చేరాడు. అప్పుడు అతని జీతమెంతో తెలుసా? జస్ట్ రూ.1500. ఇక సినిమాల్లో అక్షయ్ కుమార్ మొదటి పారితోషికం ఎంత తీసుకున్నాడో తెలుసా? జస్ట్ రూ. 5001. ‘నేను మొదటి సినిమాకు అందుకున్న పారితోషికం రూ. 5001. దీదార్ సినిమాకు గానూ నాకు ఈ చెక్ ఇచ్చారు’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు అక్షయ్.

ఇవి కూడా చదవండి

కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్..

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

కాగా ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు అక్షయ్ కుమార్. ఇప్పుడు అతని ఆస్తులు సుమారు రూ. 2500 కోట్లకు పైగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇక భారత దేశంలో అత్యంత సంపన్న నటుల్లో అక్షయ్ కూడా ఒకరు. అలాగే అత్యధిక పన్ను చెల్లించే నటుల్లోనూ ఒకడిగా చెలామణి అవుతున్నాడు.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..