Rashmika Mandanna: ఆయనతో కలిసి నటించడం జీవితంలో మర్చిపోలేను.. ఆసక్తికర విషయం చెప్పిన రష్మిక
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన చలాకీ చిన్నది రష్మిక మందన. టాలీవుడ్ లో అతితక్కువ సమయంలో స్టార్..
Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన చలాకీ చిన్నది రష్మిక మందన్న. టాలీవుడ్లో అతితక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకుంది ఈ బ్యూటీ. ఛలో సినిమా తర్వాత క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందంతో మరో హిట్ను తన కిటీలో వేసుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు యంగ్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. అప్పటి వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాలో మెరిసిన రష్మిక..ఆతర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో చేస్తోంది ఈ చిన్నది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. అలాగే రష్మిక బాలీవుడ్లో కూడ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అక్కడ రెండు సినిమాల్లో నటిస్తున్న రష్మిక ఒక సినిమాలో అమితాబచ్చన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. క్వీన్,సూపర్ 30 వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్ ప్రస్తుతం అమితాబ్ – రష్మికలతో గుడ్ బై సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి రోజు అమితాబ్తో కలిసి పనిచేసిన అనుభవాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది రష్మిక. అమితాబ్తో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేనిది అంటుంది ఈ బ్యూటీ. ‘ముందు రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత దర్శకుడు వికాస్తో నెక్స్ట్ డే చేయాల్సిన సన్నివేశాల గురించి ఎక్స్ప్లైన్ చేయించుకుని వాటిని అమితాబచ్చన్తో ఎలా చేయాలా అనేది చర్చించి మరీ ప్రాక్టీస్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. బిగ్ బి చాలా కూల్గా సింపుల్ గా నటించేశారట. ఆయనతో నటించేటప్పుడు పాత్రలో లీనమైపోవడంతో పెద్దగా ఆందోళన పడలేదని అంటుంది రష్మిక. ఆయనతో కలిసి నటించడం పెద్ద కష్టమే కాదు అని చెప్పుకొచ్చింది ఈ లక్కీ బ్యూటీ.
మరిన్ని ఇక్కడ చదవండి :