AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abdul Rahim: హైదరాబాద్ ఫుట్ బాల్ కోచ్ స్ఫూర్తితో మైదాన్ మూవీ.. సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ లో హీరో అజయ్ దేవగణ్

అజయ్ దేవగణ్ నటించిన మైదాన్ సినిమా ట్రైలర్ గత వారం విడుదలైంది.  ఈ ట్రైలర్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ 1951లో భారత ఫుట్ బాల్ జట్టు ఆసియా గేమ్స్ గెలిచిన హైదరాబాదీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Abdul Rahim: హైదరాబాద్ ఫుట్ బాల్ కోచ్ స్ఫూర్తితో మైదాన్ మూవీ.. సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ లో హీరో అజయ్ దేవగణ్
Abdul Rahim
Balu Jajala
|

Updated on: Mar 12, 2024 | 9:09 AM

Share

అజయ్ దేవగణ్ నటించిన మైదాన్ సినిమా ట్రైలర్ గత వారం విడుదలైంది.  ఈ ట్రైలర్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ 1951లో భారత ఫుట్ బాల్ జట్టు ఆసియా గేమ్స్ గెలిచిన హైదరాబాదీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారత ఫుట్ బాల్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లి దేశానికి పతకాలు తెచ్చిన ఘనత రహీమ్ దే. అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ లెజెండరీ కోచ్ అబ్దుల్ రహీమ్ పాత్రలో నటించగా, ప్రియమణి, గజరాజ్ రావు, రుద్రనీల్ ఘోష్ నటించారు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్ గుప్తా, ఆకాష్ చావ్లా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ బయోపిక్కు సాయివిన్ క్వాడ్రాస్, రితేష్ షా స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ ముంతాషిర్ శుక్లా సాహిత్యం అందిస్తున్నారు. ఈద్ సందర్భంగా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సయ్యద్ అబ్దుల్ రహీమ్ లాంటి గొప్ప వ్యక్తి గురించి చాలా మందికి తెలియకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బోనీ కపూర్ అన్నారు. ఆయన సాధించిన విజయాలకు సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన జట్టులో చున్నీ గోస్వామి, పీకే బెనర్జీ, బలరాం, ఫ్రాంకో, అరుణ్ ఘోష్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రహీమ్ 1950 నుంచి 1963 వరకు దశాబ్దానికి పైగా భారత ఫుట్ బాల్ జట్టుకు కోచ్ గా పనిచేశాడు. “భారత ఫుట్ బాల్ స్వర్ణయుగం”గా పరిగణించబడే ఈ కాలంలో ఇండియాలో 1951, 1962 ఆసియా క్రీడలలో రెండు బంగారు పతకాలు సాధించింది.

రహీమ్ 1909 ఆగస్టు 17న హైదరాబాద్ లో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన కళాశాల పూర్వ విద్యార్థులతో కూడిన బృందానికి ప్రాతినిధ్యం వహించారు. ఖాచిగూడ మిడిల్ స్కూల్, ఉర్దూ షరీఫ్ స్కూల్, దారుల్ ఉల్ ఉలూమ్ హైస్కూల్, చాదర్ఘాట్ హైస్కూల్ సహా పలు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.

రహీమ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా కూడా సంపాదించాడు. తరువాత ప్రొఫెషనల్ ఫుట్ బాల్ క్రీడాకారుడిగా ఎదిగాడు. అతను స్థానిక క్లబ్ ఖమర్ క్లబ్ కోసం ఆడాడు. రహీం 1943 నుండి హైదరాబాద్ ఫుట్ బాల్ సంఘంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన మరణించే వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950లో హైదరాబాద్ పోలీస్ కోచ్ గా నియమితులయ్యారు. అతని మార్గదర్శకత్వంలో జట్టు రోవర్స్ కప్ లో వరుసగా ఐదు సార్లు విజయం సాధించి, నాలుగు సార్లు డ్యూరాండ్ కప్ ను గెలుచుకుంది. 1951 ఆసియా గేమ్స్ లో ఇరాన్ పై భారత్ 1-0 తేడాతో విజయం సాధించింది. 1963 జూన్ 11న 53 ఏళ్ల వయసులో రహీమ్ తుది శ్వాస విడిచారు.