ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. త్వరలో బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పబోతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పబోతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 31వ మూవీని అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న ఎన్టీఆర్.. ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇక ఈ రెండు చిత్రాల అనంతరం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి అన్ని సంప్రదింపులు పూర్తి అయినట్లు టాక్. ఇక ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు(మే 20) రానున్నట్లు ఫిలింనగర్లో పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా ఈ ప్రాజెక్ట్ను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో నిజమెంతో మరో 10 రోజుల్లో తేలనుంది. కాగా కేజీఎఫ్తో దేశవ్యాప్తంగా క్రేజ్ను తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఈ దర్శకుడు యశ్తో కేజీఎఫ్ 2ను తెరకెక్కిస్తున్నారు. మొదట ఈ మూవీని అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ లాక్డౌన్ నేపథ్యంలో ఈ చిత్ర విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read this Story Also: మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పిన దుల్కర్.. దర్శకుడు ఎవరంటే..!