AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్న అన్నాదమ్ములు.. రంగంలోకి దిగుతోన్న ఆ డైరెక్టర్‌..

Tollywood: టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్‌కు బీజం పడనున్నట్లు తెలుస్తోంది. రియల్‌ లైఫ్‌లో అన్నదమ్ములు తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌ను షేర్‌ చేసుకోనున్నారు. వీరిద్దరు మరెవరో కాదు..

Tollywood: సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్న అన్నాదమ్ములు.. రంగంలోకి దిగుతోన్న ఆ డైరెక్టర్‌..
Narender Vaitla
|

Updated on: Jul 23, 2022 | 9:48 PM

Share

Tollywood: టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్‌కు బీజం పడనున్నట్లు తెలుస్తోంది. రియల్‌ లైఫ్‌లో అన్నదమ్ములు తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌ను షేర్‌ చేసుకోనున్నారు. వీరిద్దరు మరెవరో కాదు అక్కినేని యంగ్‌ హీరోలు నాగ చైతన్య, అఖిల్‌. ప్రస్తుతం నాగచైతన్య, అఖిల్‌ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్తలు గతంలో చాలా సార్లు వచ్చినా కార్యరూపం మాత్రం దాల్చలేదు. అయితే తాజాగా మరోసారి ఈ మల్టీస్టారర్‌ మూవీకి అడుగు ముందుకు పడినట్లు తెలుస్తోంది.

సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, నారప్ప వంటి చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీకాంత్‌ అడ్డాల అక్కినేని అన్నదమ్ములను కలిపే పడనున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత అఖిల్‌ కోసం శ్రీకాంత్‌ అడ్డాల నాగార్జునకు ఓ కథ వినిపించాడట, ఆ కథ నచ్చడంతో నాగ్‌ సినిమాపై ప్రత్యేక దృష్టిసారించారని సమాచారం. ఈ సినిమా కథలో పలు మార్పులు, చేర్పులు చేసి మల్టీ స్టారర్‌గా మార్చమని నాగ్‌ సలహా ఇచ్చారని సమాచారం.

Akkineni

ఇవి కూడా చదవండి

దీంతో శ్రీకాంత్‌ అడ్డాల కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్‌లో నాగ్‌ స్వయంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..