Tamil Nadu Assembly Election 2021 voting: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతం.. విజయంపైనే అభ్యర్థుల ధీమా

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న

Tamil Nadu Assembly Election 2021 voting: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతం.. విజయంపైనే అభ్యర్థుల ధీమా
Tamilnadu Kerala Puducherry Assembly Election Voting
Follow us

| Edited By: uppula Raju

Updated on: Apr 07, 2021 | 12:45 AM

Tamilnadu Kerala Puducherry Assembly Elections 2021: దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటర్లు సురక్షితంగా ఓటు వేశారు.

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్‌సభ నియోజకవర్గాలకూ మంగళవారం పోలింగ్‌ జరిగింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరిగింది. సమయం ముగిసే సమయానికి క్యూల లైన్‌లో ఉన్నటువంటివాకి కూడా ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించారు ఆయా రాష్ట్రాల ఎస్ఈసీలు.

Latest Articles