Manipur Elections: ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. స్వతంత్ర ఎమ్మెల్యే అషాబ్ ఉద్దీన్ రాజీనామా!
ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలతో పాటే మణిపూర్ రాష్ట్రంలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మణిపూర్ రాజకీయ నేతల జంపింగ్ జపాంగ్లు కొనసాగుతున్నాయి.
Manipur Assembly Election 2022: ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలతో పాటే మణిపూర్(Manipur) రాష్ట్రంలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మణిపూర్ రాజకీయ నేతల జంపింగ్ జపాంగ్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. కాగా, స్వతంత్ర ఎమ్మెల్యే, Md అషాబ్ ఉద్దీన్(MD Ashab Uddin) మణిపూర్.. శాసనసభ(Manipur Assembly) సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జేడీయూ తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం.
మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి కె మేఘ్జిత్ సింగ్ ఇంఫాల్లో నిన్న విడుదల చేసిన అధికారిక బులెటిన్లో, “జిరిబామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే మహ్మద్ అషబ్ ఉద్దీన్ మణిపూర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.” అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అషాబ్ రాజీనామా తర్వాత, జిరిబామ్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు శుక్రవారం (28 జనవరి 2022) నుండి ఖాళీగా మారిందని ఆయన చెప్పారు.
మహ్మద్ అషాబ్ ఉద్దీన్ రాజీనామాతో 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే రాజీనామా చేసిన తర్వాత అషాబ్ ఉద్దీన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం, అతను జనతాదళ్ యునైటెడ్లో చేరుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మణిపూర్లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే మహ్మద్ అషాబ్ ఉద్దీన్ మద్దతు ఇస్తున్నారు. ఈ నెల రెండవ వారంలో జనవరి 10న, చురాచంద్పూర్ జిల్లా పరిధిలోని తిపైముఖ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ చల్తాన్లియన్ అమో కూడా రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేసి, ఆ తర్వాత ఇంఫాల్లోని భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఐదేళ్ల క్రితం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమై, 21 సీట్లు గెలుచుకున్న బీజేపీ నలుగురు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటైంది. ఓడించింది. నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, తృణమూల్ కాంగ్రెస్, లోక్ జనశక్తి పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే, స్వతంత్ర మహ్మద్ అషబ్ ఉద్దీన్ మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇదిలావుంటే, కరోనా సంక్షోభం మధ్య మణిపూర్లో ఈసారి రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 38 స్థానాలకు పోలింగ్ జరుగగా, మిగిలిన 22 స్థానాలకు రెండో దశలో (మార్చి 3) ఓటింగ్ జరగనుంది. ఇతర రాష్ట్రాలతోపాటు మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read Also… మరో వివాదంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. సంచలన ఆరోపణలు చేసిన ఆయన సోదరి.. సిద్దూ సతీమణి ఎమన్నారంటే?