ఉత్తరాఖండ్లో నకిలీ నోట్ల కలకలం.. ముగ్గురు అరెస్ట్..
ఉత్తరాఖండ్లో భారీగా నకిలీ నోట్ల ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. రాష్ట్రంలోని చంపావత్లో ఈ ముఠా వెలుగులోకి వచ్చింది.నకిలీ వంద రూపాయల నోట్లను ప్రింట్ చేసి.. మార్కెట్లో..
ఉత్తరాఖండ్లో భారీగా నకిలీ నోట్ల ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. రాష్ట్రంలోని చంపావత్లో ఈ ముఠా వెలుగులోకి వచ్చింది.నకిలీ వంద రూపాయల నోట్లను ప్రింట్ చేసి.. మార్కెట్లో చెల్లుబాటు చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ నకిలీ వంద రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న ముగ్గురు సభ్యులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద పెద్ద ఎత్తున నకిలీ వంద రూపాయల నోట్లను గుర్తించారు. మొత్తం రూ.4లక్షల విలువ గల నోట్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Uttarakhand: Police arrest 3 and recover fake Indian currency notes with a face value of Rs 4 lakh in Champawat today. pic.twitter.com/FplA04kNQm
— ANI (@ANI) July 2, 2020