AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్!

Mohammed Siraj Consecutive Sixes Video: సిరాజ్ ప్రదర్శించిన ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత క్రికెట్ యాజమాన్యానికి పెద్ద ఉపశమనం అందించనుంది. రాబోయే ముఖ్యమైన సిరీస్‌లకు ముందు దిగువ వరుస బ్యాటర్లు కూడా ఇలా పరుగులు రాబట్టడం భారత్‌కు కలిసివచ్చే అంశం.

Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్!
Mohammed Siraj Consecutive Sixes Video
Venkata Chari
|

Updated on: Aug 10, 2026 | 6:46 AM

Share

Mohammed Siraj Consecutive Sixes Video: శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన ఆల్‌రౌండ్ విన్యాసాలతో అదరగొట్టాడు. చివరి ఓవర్లో గెలవడానికి 16 పరుగులు కావాల్సిన దశలో వరుసగా మూడు భారీ సిక్సర్లు బాది భారత్‌కు ఊహించని విజయాన్ని అందించాడు. కేవలం 15 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 1 ఫోర్‌తో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మైదానంలో బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టే మహమ్మద్ సిరాజ్, ఈసారి బ్యాట్‌తో ప్రతి ప్రత్యర్థి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆఖరి ఘట్టానికి చేరుకునేసరికి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ క్రీజులో ఉన్నాడు. కెషార నువంత వేసిన ఆ ఓవర్లో మొదటి బంతి నుంచి తన పవర్ హిట్టింగ్ రుచి చూపించాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివింది: టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే మొనగాళ్లు.. ఒక్క ఓవర్‌లోనే బీభత్సం.. మనోడి రికార్డ్ బద్దలవ్వడం కష్టమే

బ్యాట్ పరిశీలించిన శ్రీలంక ఆటగాళ్లు..

సిరాజ్ ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ చూసి శ్రీలంక ప్లేయర్లు ఆశ్చర్యపోయారు. అసలు ఒక ఫాస్ట్ బౌలర్ ఇంతటి క్లీన్ హిట్టింగ్ ఎలా చేయగలిగాడో అర్థం కాక మ్యాచ్ పూర్తయ్యాక అతని బ్యాట్‌ను దగ్గరుండి పరిశీలించారు. సిరాజ్ వాడిన బ్యాట్‌లో ఏమైనా ప్రత్యేకత ఉందా అని సరదాగా చెక్ చేయడం అక్కడ నవ్వులు పూయించింది. సిరాజ్ సాధించిన ఈ ఫినిషింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో కేవలం సిరాజ్ మెరుపులే కాదు, ఆరంభంలో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కూడా జట్టు విజయానికి గట్టి పునాది వేశారు. యశస్వి జైస్వాల్ 46 బంతుల్లో 61 పరుగులు చేసి ఆకట్టుకోగా, శుభ్‌మన్ గిల్ 54 బంతుల్లో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరి నిలకడైన ప్రదర్శనతో భారత్ లక్ష్యం దిశగా సాగింది. ఆ తర్వాత సిరాజ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో విజయం ఖాయమైంది.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

వార్మప్ మ్యాచ్‌ ఫార్మాట్‌తో ఊహించని మలుపు..

చివరి ఓవర్లో లక్ష్యాన్ని పూర్తి చేసినప్పటికీ, వార్మప్ మ్యాచ్ నిబంధనల ప్రకారం ఓవర్ ముగిసే వరకు సిరాజ్ బ్యాటింగ్ కొనసాగించాడు. 15 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సిరాజ్, భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలర్‌గా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ హైదరాబాదీ ప్లేయర్, ఇప్పుడు బ్యాటర్‌గా కూడా తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us