Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
Jogulamba Gadwal District: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు
Jogulamba Gadwal District: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. ఇద్దరు కొడుకులను తీసుకొని ఓ వ్యక్తి 44వ జాతీయ రహదారిపై కర్నూలు వైపు బైక్ వెళుతుండగా.. శనివారం ఉదయం అలంపూర్ చౌరస్తా ఉత్తర ఫుడ్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన డీసీఎం.. బైక్ను వేగంగా ఢీకొంది. అనంతరం చిన్నారుల శరీరభాగల పైనుంచి డీసీఎం వెళ్లిపోయింది. ఈ ఘటనలో చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. తండ్రికి గాయాలయ్యాయి.
మరణించిన చిన్నారులు మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రిషి, నిశితగా పోలీసులు గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పలు వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో చిన్నారుల ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read: